News February 12, 2025

కరీంనగర్: టెన్త్ అర్హతతో ఉద్యోగాలు

image

కరీంనగర్ డివిజన్‌లో 50 జీడీఎస్ పోస్టులకు తపాలా శాఖలో నోటిఫికేషన్ విడుదలైంది. టెన్త్ అర్హతతో కంప్యూటర్ జ్ఞానం ఉండాలి. వయసు 18-40 ఏళ్ల మధ్య ఉండాలి. సైకిల్ లేదా బైక్ నడపగలగాలి. టెన్త్ మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. జనరల్, OBC, EWS వారికి దరఖాస్తు ఫీజు రూ.100. మిగిలిన వారికి ఉచితం. మార్చి 3వరకు ఈ https://indiapostgdsonline.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Similar News

News February 12, 2025

ఆ సమయంలో అన్నీ ఆత్మహత్య ఆలోచనలే: దీపికా పదుకొణె

image

నటి దీపికా పదుకొణె ‘పరీక్షా పే చర్చ’లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చదువు, క్రీడలు, మోడలింగ్ తర్వాత యాక్టింగ్.. ఇలా జీవితంలో ఎన్నో మార్పులు చూసినట్లు తెలిపారు. 2014 తర్వాత జీవితంలో సమస్యలతో కుంగుబాటుకు గురైనట్లు వెల్లడించారు. ఆ సమయంలో ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవని తెలిపారు. సినిమాల్లో సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్న ఈ అమ్మడు రణ్‌వీర్‌ను పెళ్లి చేసుకొని ఇటీవల ఓ బిడ్డకు తల్లయ్యారు.

News February 12, 2025

రేషన్ కార్డ్‌లపై అదనపుఛార్జి వసూలు చేస్తే కాల్ చేయండి

image

కొత్త రేషన్ కార్డు దరఖాస్తుకు వచ్చే పేద ప్రజలు మీ సేవ కేంద్రంలో ఆన్‌లైన్ సేవల రుసుము ₹45 మాత్రమే చెల్లించాలి. రసీదుపై ప్రింటైన రుసుమ కంటే నయా పైసా అదనంగా చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు అని తెలిపారు. అదనంగా వసూలు చేస్తే 040-45676699 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News February 12, 2025

ఎన్నికల్లో అభ్యర్థిగా ‘నోటా’.. ఓట్లు ఎక్కువ వస్తే?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాన్ని అడ్డుకునేందుకు నోటాను అభ్యర్థిగా చేర్చాలని EC సన్నాహాలు చేస్తోంది. MH, హరియాణా వంటి రాష్ట్రాల్లో ఈ విధానం ఇప్పటికే అమలులో ఉంది. ఒకవేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నిక నిర్వహించే అవకాశముంది. తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థికి రీ ఎలక్షన్స్‌లో పోటీ చేసే అర్హత లేదు. ఇందులోనూ నోటాకే ఎక్కువ ఓట్లు వస్తే అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.

error: Content is protected !!