News February 9, 2025

కరీంనగర్: రేపటితో ముగియనున్న నామినేషన్లు

image

KNR, ADLBD, NZBD, MDK పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు రేపటితో నామినేషన్ల గడువు ముగియనుంది. ఇప్పటిదాకా BJP, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు 49 మంది నామినేషన్ వేశారు. ఉపాధ్యాయ స్థానానికి బీజేపీ అభ్యర్థితో పాటు PRTUTS, TPTF అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, మరో 5గురు నామినేషన్లు వేశారు. పట్టభద్రుల స్థానంలో ప్రస్తుతం కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Similar News

News February 10, 2025

కరీంనగర్: ముగిసిన ఎమ్మెల్సీ నామినేషన్ల గడువు.. అప్డేట్

image

కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటివరకు మొత్తం గ్రాడ్యుయేట్ నామినేషన్లు- 100, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నామినేషన్లు- 17 దాఖలయ్యాయని ఎన్నికల అధికారి, కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి వెల్లడించారు. ఇందులో నేడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి దాఖలైన నామినేషన్లు- 51, టీచర్స్ ఎమ్మెల్సీకి నామినేషన్లు- 8 వచ్చాయని తెలిపారు. కాగా.. నామినేషన్ ప్రక్రియ నేటితో ముగిసింది.

News February 10, 2025

చిగురుమామిడి: బైక్‌కు అడ్డొచిన కోతి.. ఇద్దరికి గాయాలు

image

కోతి అడ్డు రావడంతో ద్విచక్రవాహనంపై నుంచి కింద పడిన ఓ మహిళ కాలు విరిగింది. చిగురుమామిడి గ్రామంలోని పెద్దమ్మతల్లి ఆలయ సమీపంలో, కేశవపూర్‌కు చెందిన పద్మ, భర్తతో కలిసి సోమవారం బైక్‌పై వెళ్తున్నారు. వాహనానికి వానరం అడ్డురావడంతో బ్రేక్ వేయగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో పద్మ కాలు విరిగి తీవ్రంగా గాయపడగా.. భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. కాగా, క్షతగాత్రులను 108 వాహనంలో కరీంనగర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

News February 10, 2025

KNR: రేపు ముసాయిదా జాబితా విడుదల

image

మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. మొదట మండల, జిల్లా పరిషత్ ఎన్నికలే నిర్వహిస్తామని ప్రభుత్వం చెబుతుండటంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. KNR జిల్లాలో 15 ZPTCలు, 170 MPTC స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితా విడుదల చేయనున్నారు.

error: Content is protected !!