News October 17, 2024
కరీంనగర్: వినూత్నంగా యువ నాయకుడి మేనిఫెస్టో!
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం లక్ష్మక్కపల్లిలో సర్పంచ్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు మేనిఫెస్టోను యువ నాయకుడు మద్దుల ప్రశాంత పటేల్ విడుదల చేశారు. తనను గెలిపిస్తే 10 తరాలు గుర్తుండిపోయేలా చేస్తానంటూ ముందస్తుగా విడుదల చేసి నాయకులు ఆలోచింపజేసే విధంగా చేశారు. ప్రతి నెల హెల్త్ క్యాంప్, ఆడ పిల్ల పెళ్లి కానుక, మూతబడిన పాఠశాల రీ-ఓపెన్, ఆడపడుచులకు టైలరింగ్ శిక్షణ తదితర హామీలు మేనిఫెస్టోలో ఉన్నాయి.
Similar News
News October 17, 2024
గోదావరిఖని: రహదారిపై యువకుడి మృతి
గోదావరిఖని పరశురాం నగర్కు చెందిన సంతోశ్ పట్టణంలోని కళ్యాణ్ నగర్ మటన్ షాపుల రహదారిపై మృతి చెందాడు. ఒక్కసారిగా రోడ్డుపై పడిపోయి ప్రాణాలు వదిలాడు. అయితే అతిగా మద్యం తాగి మరణించి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News October 17, 2024
జగిత్యాల: ట్రాన్స్జెండర్తో యువకుడి ప్రేమ వివాహం
ట్రాన్స్జెండర్తో యువకుడు ప్రేమ వివాహం చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాలు.. గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్కు చెందిన కుమార్, మ్యాడంపెల్లికి చెందిన కరుణంజలి కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం పెద్దలకు చెప్పి ఒప్పించి బుధవారం వివాహం చేసుకున్నారు. జగిత్యాల జిల్లా ట్రాన్స్జెండర్ల అధ్యక్షురాలు నిహారిక, సభ్యులు అలకుంట ప్రశాంతి, రాంబాయి, జానూ, రాధికా, రమ్య, ఆరోహి పాల్గొన్నారు.
News October 17, 2024
పెండింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలి: గౌతమ్
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పెండింగ్ పనులను వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావాలని మున్సిపల్ డైరెక్టర్ పీవీ గౌతమ్ ఆదేశించారు. బుధవారం ఆయన కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతితో కలిసి చింతల కుంట పరిధిలో నిర్మిస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పురోగతి వివరాలను ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు ఉండే విధంగా వసతులు ఏర్పాటు చేయాలని తెలిపారు.