News February 28, 2025

కరీంనగర్: స్ట్రాంగ్ రూమ్స్‌కు సీల్ వేసిన రిటర్నింగ్ అధికారి

image

కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో ఎమ్మెల్సీ ఎన్నికల బాక్స్‌లు నిల్వచేసిన స్ట్రాంగ్ రూమ్‌కు సీల్ వేసినట్లు ఎమ్మెల్సీ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు. ఎన్నికల పరిశీలకులు మహేశ్ దత్ ఎక్కా ఇతర ముఖ్యఅధికారుల సమక్షంలో సీల్ వేశామన్నారు. పట్టభద్రులు, ఉపాధ్యాయుల బ్యాలెట్ బాక్స్‌లను వేరువేరుగా భద్రపరిచామన్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News December 14, 2025

కరీంనగర్ జిల్లాలో 84.63% పోలింగ్ నమోదు

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 5 మండలాల్లో తుది పోలింగ్ శాతం వివరాలను అధికారులు వెల్లడించారు. మొత్తం 84.63% పోలింగ్ కాగా, చిగురుమామిడిలో 85.82%. గన్నేరువరంలో 88.55%, మానకొండూరులో 82.34%, శంకరపట్నంలో 84.98%, తిమ్మాపూర్ లో 84.83% పోలింగ్ నమోదైనట్లు తెలిపారు. మొత్తం 111 గ్రామ పంచాయితీల్లో 185003 ఓట్లకు గాను 156568 ఓట్లు పోలయ్యాయి.

News December 14, 2025

రామకృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

image

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని రామ కృష్ణ కాలనీ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పరిశించారు. పోలింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ పర్సంటేజ్‌ను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. ఇక్కడ జిల్లా అధికారులు, మండల అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

News December 14, 2025

కరీంనగర్ జిల్లాలో 111 గ్రామాల్లో పోలింగ్

image

కరీంనగర్ జిల్లాలో నేడు రెండవ దశ గ్రామపంచాయతీ ఎన్నికలు.మానకొండూర్ నియోజకవర్గంలోని 113 గ్రామాలకు గాను రెండు ఏకగ్రీవం కాగా, 111 గ్రామాలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1046 వార్డుల్లో 197 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 849 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ బరిలో 436 మంది, వార్డు సభ్యులుగా 2275 మంది ఉన్నారు. 1,84,761 మంది తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.