News April 24, 2024
కర్నూలు: 594 మార్కులు సాధించిన రైతు బిడ్డ
రుద్రవరం మండలం బీరవోలుకు చెందిన రైతు పుల్లారెడ్డి, శిరీష దంపతుల కుమార్తె ఎం హర్షిత 594 మార్కులు సాధించి మండలంలో అత్యధిక మార్కులు సాధించిన బాలికగా నిలిచింది. అలాగే తాను చదివిన నంద్యాలలోని గురురాజ పాఠశాలలో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. తమ కూతురు పదో తరగతి పరీక్షల్లో ఇలా మొదటి ర్యాంకు సాధించినందుకు తమకెంతో ఆనందంగా ఉందని విద్యార్థిని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు.
Similar News
News February 5, 2025
కర్నూలు APSP బెటాలియన్ కమాండెంట్గా దీపిక బాధ్యతల స్వీకరణ
కర్నూలు ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్గా దీపిక పాటిల్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పోలీసుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని వెల్లడించారు. ముందుగా బెటాలియన్ అధికారుల నుంచి ఆమె గౌరవ వందనం స్వీకరించారు. అడిషనల్ కమాండెంట్ మెహబూబ్ బాషా, తదితరులు పాల్గొన్నారు.
News February 5, 2025
కుటుంబానికి 100 రోజులు పని కల్పించాలి: కలెక్టర్
ఉపాధి హామీ పథకం ద్వారా ప్రతి రోజూ లక్ష మందికి ఉపాధి పనులు కల్పించాలని ఏపీడీ, ఎంపీడీవో, ఏపీవోలను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు.ఉపాధి హామీ పనుల పురోగతి అంశంపై ఏపీడీలు, ఎంపీడీవోలు, ఏపీవోలతో కలెక్టర్ టెలికాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. పనుల కల్పనలో వెనుకబడిన అధికారులతో మాట్లాడారు. కుటుంబానికి 100 రోజుల పని కల్పించాలన్నారు.
News February 5, 2025
పారా అథ్లెటిక్స్లో ఎమ్మిగనూరు డిగ్రీ విద్యార్థి ఘనత
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఈనెల 2న జరిగిన 7వ రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్లో ఎమ్మిగనూరు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి పింజారి బషీర్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 1,500 మీటర్ల పరుగు పందెంలో మొదటి స్థానం సాధించాడు. ఈ విజయంతో కళాశాలకు రాష్ట్రస్థాయిలో గుర్తింపు వచ్చిందని కళాశాల అధ్యక్షుడు డా.మహబూబ్ బాషా పేర్కొన్నారు. బషీర్ను కళాశాల అధ్యాపక సిబ్బంది అభినందించారు.