News October 16, 2024
కర్నూలు: అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళిక
అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 జిల్లా ప్రణాళికను రూపొందించాలని కర్నూలు కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో స్వర్ణాంధ్ర@ 2047 జిల్లా ప్రణాళిక రూపకల్పనపై అధికారులతో సమావేశం నిర్వహించారు. పరిశ్రమల ఏర్పాటు, మార్కెటింగ్, హార్టికల్చర్ అభివృద్ధి, వ్యవసాయం, తదితర అంశాలపై అధికారులతో చర్చించారు.
Similar News
News October 16, 2024
నంద్యాల జిల్లాలో నేడు సెలవు
నంద్యాల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని విద్యాసంస్థలు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. అలాగే కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశామని అన్నారు. కాగా కర్నూలు జిల్లాలో సెలవు ప్రకటించలేదు.
News October 16, 2024
నంద్యాల జిల్లాలో సెలవు ఇవ్వాలని డిమాండ్
అల్పపీడన ప్రభావంతో నంద్యాల జిల్లాలో జోరు వాన పడుతోంది. మహానంది, రుద్రవరం, ఆళ్లగడ్డ, కొలిమిగుండ్ల, నంద్యాల, అవుకు తదితర మండలాల్లో నిన్నటి నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. మరోవైపు నేడు, రేపు వర్షాలు కొనసాగుతాయని వాతావరణశాఖ తెలపడంతో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ముసురు వాతావరణం నెలకొనడంతో బయటకు వచ్చే పరిస్థితిలేదని సెలవు ఇవ్వాలని కోరుతున్నారు.
News October 15, 2024
కర్నూలు, నంద్యాలలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
భారీ వర్షాల నేపథ్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. కర్నూలు కలెక్టరేట్లో 08518-277305, నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో 08514-293903, 08514-293908 నంబర్లను అందుబాటులో ఉంచారు. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ఫోన్ చేయాలని అధికారులు పేర్కొన్నారు. 24గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో బుధ, గురువారాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.