News May 27, 2024

కర్నూలు: కరెంటు వైర్‌తో ఉరివేసుకొని బాలిక ఆత్మహత్య

image

కడుపు నొప్పి తాళలేక బాలిక ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం జరిగింది. మిడుతూరు మండలం వీపనగండ్ల గ్రామంలో గోయన్న గారి హేమలత(16) ఉదయం 10:30 గంటల ఇంటిలో ఎవరూ లేని సమయంలో ఇంటి పై కప్పుకు కరెంటు వైర్‌తో ఉరివేసుకుంది. పనికి వెళ్లి ఇంటికి వచ్చిన అమ్మమ్మ పద్మావతమ్మ చూసి చుట్టుపక్కల వారిని పిలిచి ఆటోలో వైద్యశాలకు తరలించారు. బాలిక మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

Similar News

News October 10, 2024

KNL: బన్నీ ఉత్సవాలకు బందోబస్తు వివరాలు ఇలా!

image

కర్నూలు జిల్లా దేవనకొండ మండల పరిధిలోని దేవరగట్టులో దసరా పురస్కరించుకొని నిర్వహించే బన్నీ ఉత్సవ ఏర్పాట్లకు ఎస్పీ బిందు మాధవ్ పట్టిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈమేరకు పోలీస్ బందోబస్తు వివరాలను ఎస్పీ వివరించారు. DSPలు-7, CIలు-42, SIలు-54, ASI, HCలు-112, PCలు-362, హోంగార్డులు-95 మంది, స్పెషల్ పార్టీ పోలీసులు-50తో పాటుగా 3 ప్లాటూన్ల AR పోలీసులను బందోబస్తు విధులకు కేటాయించినట్లు వెల్లడించారు.

News October 9, 2024

పతకాలు సాధించిన క్రీడాకారులకు కలెక్టర్ అభినందన

image

రాజమండ్రిలో ఈ నెల 4 నుంచి 8వ తేదీ వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలు సాధించిన కర్నూలు జిల్లా క్రీడాకారులను కలెక్టర్ రంజిత్ బాషా అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామన్నారు. కార్యక్రమంలో డీఎస్డీవో భూపతిరావు, అథ్లెటిక్స్ కోచ్ కాశీ రావు పాల్గొన్నారు.

News October 9, 2024

బన్ని ఉత్సవాలకు పోలీసు బందోబస్తు: ఎస్పీ

image

12న జరిగే దేవరగట్టు శ్రీ మాలమల్లేశ్వర స్వామి బన్ని ఉత్సవాలకు 800 మంది పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. ఏడుగురు డీఎస్పీలు, 42 మంది సీఐలు, 54 మంది ఎస్సైలు, 112 మంది ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, 362 మంది కానిస్టేబుళ్లు, 50 మంది స్పెషల్ పార్టీ పోలీసులు, 3 ప్లటూన్ల ఏఆర్ పోలీసులు, 95 మంది హోంగార్డులు విధుల్లో ఉంటారన్నారు.