News April 1, 2025

కర్నూలు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ@9Am.!

image

కర్నూలు జిల్లాలో ఏప్రిల్ నెలకు సంబంధించి మంగళవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో ఉదయం 7 గంటల నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉదయం 9 గంటలకు జిల్లాలో 54.35% పింఛన్ల పంపిణీ పూర్తయింది. ఇప్పటివరకు జిల్లాలో 2,38,302 మందికి గానూ 1,29,522 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

Similar News

News April 5, 2025

కర్నూలు: 10th విద్యార్థులకు ఉచిత కోచింగ్

image

కర్నూలు జిల్లా 10th విద్యార్థులకు శుభవార్త. పదో తరగతి పరీక్షలు కంప్లీట్ అయిన విద్యార్థులకు తాండ్రుపాడు ప్రభుత్వ మైనారిటీ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్‌ ప్రవేశానికి ఉచిత కోచింగ్ ఇవ్వనున్నారు. శుక్రవారం నుంచి ఈనెల 28 వరకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ చక్రవర్తి తెలిపారు. శిక్షణకు వచ్చే విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కూడా ఇస్తామన్నారు. వివరాలకు తాండ్రుపాడు కళాశాలను సంప్రదించాలన్నారు.

News April 5, 2025

కర్నూలు జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలు ఇవే.!

image

కర్నూలు జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. కోడుమూరులో అధికంగా 46.4 MM, సి.బెళగల్ 37.8, గోనెగండ్ల 24.2, కర్నూలు(A)23.6, చిప్పగిరి 22.8, కల్లూరు 21.0. కర్నూలు(R)19.8, కృష్ణగిరి 18.2, మంత్రాలయం 14.2, గూడూరు 13.0, హాలహర్వి 11.8, వెల్దుర్తి 11.4, ఎమ్మిగనూరు 10.4, ఆదోని 9.2, కోసిగి 8.8, పెద్దకడబూరు 7.4. నందవరం 7.2, దేవనకొండ 6.8, తుగ్గలి 3.4, ఆస్పరి 3.0, మద్దికెరలో 1.4MMగా పడింది.

News April 4, 2025

దేవ‌సేన శోభా బ‌ర్త్ డే.. మ‌నోజ్ ఎమోష‌న‌ల్ పోస్ట్!

image

మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులు తమ ముద్దుల కుమార్తె దేవసేన శోభా MM తొలి పుట్టినరోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను మంచు మనోజ్ నెట్టింట షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘అంతకు ముందు మేము ముగ్గురం. ఏడాది క్రితం నలుగురం అయ్యాం. దేవసేన శోభ జననం మా జీవితాల్లో వెలుగుతోపాటు ధైర్యాన్ని, అంతులేని సంతోషాన్ని తీసుకొచ్చింది. కుమార్తెను కంటికి రెప్పలా కాపాడుకుంటాం’ అని రాసుకొచ్చారు.

error: Content is protected !!