News June 17, 2024

కర్నూలు: ముంతాజ్ బేగంకు జాతీయ యోగా పురస్కారం

image

కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ యోగా గురువు డాక్టర్ ఎస్.ముంతాజ్ బేగంకు జాతీయ యోగా టీచర్ అవార్డుతో పాటు యోగారత్న అవార్డును హరియాణాకు చెందిన మానవియ్య నిర్మాణ్ మంచ్ ఇండియా ప్రకటించింది. 15ఏళ్లుగా నిర్విరామంగా యోగాతో పాటు సేవా కార్యక్రమాలను నిర్వహించినందుకు గాను ఈ అవార్డు అందజేయనున్నారు. జూన్ 21న 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఈ అవార్డును ముంతాజ్ బేగం హరియణాలో అందుకోనున్నారు.

Similar News

News October 3, 2024

నంద్యాల జిల్లాలో హత్య.. అనుమానమే కారణం!

image

కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో హత్య జరిగిన విషయం తెలిసిందే. స్థానికుల సమాచారం మేరకు.. భార్య పార్వతిని భర్త రామమోహన్ గొడ్డలితో నరికి చంపాడు. వీరికి వివాహమై 16ఏళ్లు కాగా కొద్దిరోజులుగా భర్త భార్యకు దూరంగా ఉన్నాడు. ఇటీవల మళ్లీ ఆమె వద్దకు వచ్చిన ఆయన భార్యపై అనుమానం పెంచుకున్నాడు. తరచూ గొడవలు పడేవారు. ఇవాళ తెల్లవారుజామున భార్య నిద్రపోతుండగా నరికి హత్య చేశాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

News October 3, 2024

నంద్యాల జిల్లాలో మహిళ హత్య

image

నంద్యాల జిల్లాలో మరో దారుణ హత్య జరిగింది. కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లిలో ఓ భర్త భార్యను కిరాతకంగా చంపాడు. భార్యపై అనుమానంతో గొడ్డలితో నరికి చంపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News October 3, 2024

శ్రీగిరిలో నేటి నుంచి దసరా ఉత్సవాలు

image

శ్రీశైల క్షేత్రంలో దసరా నవరాత్రి మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు శైలపుత్రి అలంకారంలో భ్రమరాంబాదేవి అమ్మవారు దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో స్వామివారికి అభిషేకాలు, అమ్మవారి కుంకుమార్చనలు మినహా మిగిలిన ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు. వాహనసేవలను సామాన్య భక్తులు వీక్షించేలా ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. వాహన సేవలు, గ్రామోత్సవం, తెప్పోత్సవాలను భక్తులు <>శ్రీశైలటీవీ<<>> ద్వారా లైవ్ చూడొచ్చు.