News March 28, 2025
కర్నూలు ‘సాక్షి’ ఆఫీసు ఎదుట ఆళ్లగడ్డ MLA నిరసన

కేజీ చికెన్ కు రూ.10 వసూలు చేస్తున్నారనే YCP వ్యాఖ్యలను, ‘సాక్షి’లో వచ్చిన కథనాలను ఆళ్లగడ్డ MLA భూమా అఖిలప్రియ తీవ్రంగా ఖండించారు. కర్నూలులోని సాక్షి కార్యాలయం ఎదుట ఆమె భర్త భార్గవ్ రామ్, టీడీపీ శ్రేణులతో కలిసి కోళ్ళతో ఆమె వినూత్న నిరసన తెలిపారు. పేపర్లో వచ్చే ధరకే చికెన్ ఇప్పిస్తామనే మాటను నేను మాట్లాడితే, నాపై అవాస్తవాలు రాసి ప్రతిష్టకు బంగారం కలిగిస్తున్నారని అఖిలప్రియ ఫైర్ అయ్యారు.
Similar News
News April 2, 2025
HCU భూముల వివాదంపై సెలబ్రిటీల స్పందన

హెచ్సీయూ భూముల వివాదంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. ఇషా రెబ్బా, రేణూ దేశాయ్, ప్రియదర్శి, ఉపాసన కొణిదెల, కావ్య కళ్యాణ్రామ్, రష్మీ గౌతమ్, అభినవ్ గోమఠం, నోయెల్ షాన్, ప్రియాంక జవాల్కర్ తమ ఇన్స్టాల్లో హెచ్సీయూ భూముల్ని, అక్కడి ప్రాణుల్ని కాపాడాలనే అర్థంలో స్టోరీలు పోస్ట్ చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.
News April 2, 2025
BREAKING: పంజాబ్ ఘన విజయం

లక్నోతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 172 పరుగుల లక్ష్యాన్ని 16.2 ఓవర్లలో ఛేదించింది. ప్రభుసిమ్రన్ సింగ్ 69, శ్రేయస్ అయ్యర్ 52*, వధేరా 43* రన్స్ చేశారు. లక్నో బౌలర్ దిగ్వేశ్ 2 వికెట్లు తీశారు. అంతకుముందు LSG బ్యాటర్లలో పూరన్ 44, బదోనీ 41, మార్క్రమ్ 28, సమద్ 27, మిల్లర్ 19 రన్స్ చేశారు. అర్ష్దీప్ 3, ఫెర్గూసన్, మ్యాక్స్వెల్, మార్కో, చాహల్ తలో వికెట్ తీశారు.
News April 2, 2025
రేపట్నుంచి RTC ఉద్యోగుల నిరసనలు

AP: పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ RTC ఉద్యోగులు నిరసనలకు పిలుపునిచ్చారు. రేపు, ఎల్లుండి ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపనున్నారు. సస్పెన్షన్లు, తొలగింపు లేకుండా 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని, వెంటనే పదోన్నతులు చేపట్టాలని, ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వం లేదా సంస్థ ద్వారానే కొనాలని, నైట్అవుట్ అలవెన్స్ ₹150 నుంచి ₹400 వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.