News March 25, 2025

కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న విశాఖ జిల్లా కలెక్టర్

image

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో మూడో విడత కలెక్టర్ల సదస్సు మంగళవారం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. విశాఖ జిల్లా అభివృద్ధి, పీ-4 సర్వే పరిస్థితులపై చర్చించారు. ఈ కార్యక్రమంలో పలు జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.

Similar News

News March 29, 2025

విశాఖ: ఆరు నెల‌ల్లో మెట్రో భూసేక‌ర‌ణ‌కు చ‌ర్య‌లు

image

విశాఖ‌లో చేప‌ట్ట‌నున్న మెట్రో రైలు ప్రాజెక్టు‌కు 6 నెల‌ల్లో మొద‌టి ద‌శ భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలని అధికారుల‌ను కలెక్టర్ హరేంధిర ప్రసాద్ అప్ర‌మ‌త్తం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. మాస్ట‌ర్ ప్లాన్ రోడ్ల‌కు సంబంధించి కార్యాచ‌ర‌ణ మొద‌లు పెట్టాల‌ని, మెట్రో ప్రాజెక్టు, మాస్ట‌ర్ ప్లాన్ రోడ్డు వేసే మార్గంలో కొత్త‌గా ఎలాంటి అనుమ‌తులు ఇవ్వకూడదని ఆదేశించారు.

News March 28, 2025

విశాఖ: ‘లా అండ్ ఆర్డర్ అదుపులో ఉండాలి’

image

విశాఖ నగర సీపీ శంఖబ్రత బాగ్చి శుక్రవారం కమిషనర్ కార్యాలయంలో నెలవారి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నగరంలో యాక్టీవ్‌గా ఉన్న రౌడీ షీటర్లపై పెడుతున్న నిఘా చర్యలపై ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా పూర్తిగా నివారించాలని, గంజాయి ఎక్కడా ఉండరాదని ఆదేశించారు. రాత్రి పూట నిఘా పటిష్టం చేయాలని, ఉమెన్ సేఫ్టీ‌కి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

News March 28, 2025

విశాఖలో ఉగాది వేడుక‌ల‌కు ఘ‌నంగా ఏర్పాట్లు: జేసీ

image

ఉగాది వేడుక‌ల‌ను సంప్ర‌దాయ‌బద్దంగా నిర్వ‌హించేందుకు ఘ‌నంగా ఏర్పాట్లు చేయాల‌ని విశాఖ జేసీ మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విశాఖ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఉగాది వేడుక‌ల నిర్వ‌హ‌ణ‌పై అధికారుల‌తో స‌మీక్ష నిర్వహించారు. ఈనెల 30న ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డే విధంగా నిర్వ‌హించాల‌న్నారు. వేడుకలు అన్ని శాఖల సమన్వయంతో జరగాలన్నారు.

error: Content is protected !!