News April 19, 2025

కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మధు నియామకం

image

టంగుటూరు మండలం కందులూరు గ్రామానికి చెందిన పైనం మధుబాబు ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా శనివారం నియమితులయ్యారు. తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమించిన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిలకి, జిల్లా పార్టీ కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకాశం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.

Similar News

News April 20, 2025

ప్రకాశం: భార్యను హతమార్చిన భర్త

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 20, 2025

ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

image

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్‌లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.

News April 20, 2025

DSC: ప్రకాశం జిల్లాలో ఖాళీలు ఎన్నంటే?

image

డీఎస్సీ-2025 ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 629 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు.
➤ స్కూలు అసిస్టెంట్ లాంగ్వేజ్-1:39
➤ హిందీ:23 ➤ ఇంగ్లిష్: 95
➤ గణితం: 94 ➤ఫిజిక్స్: 76
➤ జీవశాస్త్రం: 63 ➤ సోషల్: 106
➤ పీఈటీ: 72 ➤ ఎస్జీటీ:106
NOTE: ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాలల్లో తెలుగు 2, హిందీ 4, ఆంగ్లం 4, గణితం 1, ఫిజిక్స్ 2, బయాలజీ 2, సోషల్ 2, ఎస్టీటీ 26 భర్తీ చేస్తారు.

error: Content is protected !!