News March 17, 2025
కాకినాడ: మానవత్వం మరిచి తల్లిని హత్య చేసిన కొడుకు

నేటి సమాజంలో మానవత్వం మంట కలుస్తోంది. తల్లిని హత్య చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కాకినాడ రూరల్ ఎస్.అచ్యుతాపురానికి చెందిన జహీరా బీబీ (55)పై చిన్న వివాదంతో ఆదివారం ఆమె కొడుకు షబ్బీర్ కమల్ దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలానికి రూరల్ సీఐ చైతన్య కృష్ణ, ఇంద్రపాలం ఎస్సై వీరబాబు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 17, 2025
ఖమ్మం: BC గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తుల ఆహ్వానం

బీసీ గురుకుల విద్యాలయాల్లో 2025-2026 విద్యా సంవత్సరానికి గానూ 6, 7, 8, 9వ తరగతి (ఇంగ్లిషు మీడియం)లో ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ సీట్లకు ప్రవేశం కొరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ఉమ్మడి ఖమ్మం జిల్లా బీ.సీ గురుకుల ఆర్సీఓ సి.హెచ్. రాంబాబు తెలిపారు. ఆసక్తిగల బాల-బాలికలు 150 రూపాయల రుసుముతో ఈ 31లోగా https://mjptbcadmissions .org/ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 17, 2025
ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.
News March 17, 2025
రేపు మేదరమెట్లకు వైఎస్ జగన్

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు బాపట్ల జిల్లాలో పర్యటించనున్నారు. మేదరమెట్లలో వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ అంత్యక్రియల్లో ఆయన పాల్గొంటారు. ఆమె మృతదేహానికి నివాళులర్పించి కుటుంబసభ్యులను పరామర్శిస్తారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఉన్న వైవీ సుబ్బారెడ్డి తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన ఢిల్లీ నుంచి ఒంగోలుకు బయల్దేరారు.