News February 15, 2025
కామారెడ్డి: ఎక్కడ చూసినా అదే చర్చ

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా MLC హీట్ వేడెక్కింది. గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్, BJP అభ్యర్థులు నరేందర్ రెడ్డి, అంజిరెడ్డిలతో పాటు మాజీ ప్రొఫెసర్, BSPఅభ్యర్థి ప్రసన్న హరికృష్ణ, AIFB అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్, శేఖర్ రావు, ముస్తక్ అలీ, తదితరనేతల మధ్యపోటీ నెలకొందని చర్చలు జరుగుతున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు మార్నింగ్ వాక్, ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు.
Similar News
News December 14, 2025
హైదరాబాద్లో మెస్సీ.. PHOTO GALLERY

మెస్సీ మేనియాతో హైదరాబాద్ ఊగిపోయింది. తొలిసారి నగరానికి వచ్చిన ఆయన ఉప్పల్ స్టేడియంలో కాసేపు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడారు. తనదైన మార్క్ కిక్స్తో అభిమానుల్లో ఫుల్ జోష్ నింపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్లేయర్ అవతారమెత్తారు. మెస్సీతో గేమ్ ఆడి అభిమానులను ఉర్రూతలూగించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈవెంట్కు హాజరయ్యారు. ఫొటో గ్యాలరీని పైన చూడవచ్చు.
News December 14, 2025
రేపు ఎన్నికలు జరిగే ప్రాంతాలకు సెలవు: సిద్దిపేట కలెక్టర్

రెండో విడత ఎన్నికల సందర్భంగా కలెక్టర్ సెలవు ప్రకటించారు. సిద్దిపేట జిల్లాలోని అక్బర్పేట్-భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూర్, దుబ్బాక, మిరుదొడ్డి, నంగునూరు, నారాయణరావుపేట్, సిద్దిపేట రూరల్, సిద్దిపేట అర్బన్, తొగుట మండలాల పరిధిలోని గ్రామాల్లో ఎన్నికలు జరగనున్నాయి. 10 మండలాల్లోని గ్రామాల పరిధిలో గల ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తున్నట్టు కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు.
News December 14, 2025
పాలకుర్తి: సర్పంచ్ అభ్యర్థిపై కత్తిపోట్లు

పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రామారావుపల్లి గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న జనగామ మనోజ్ కుమార్ ను శనివారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. తెల్లారితే పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో మనోజ్ కుమార్పై హత్యాయత్నం జరగడం వల్ల గ్రామం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సివుంది.


