News April 6, 2025

కామారెడ్డి జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు

image

జిల్లా వ్యాప్తంగా శనివారం నమోదైన ఉష్ణోగ్రత వివరాలు అధికారులు వెల్లడించారు అత్యధికంగా బిచ్కుందలో 39.9డిగ్రీలు, మద్నూర్ 39.8, నస్రుల్లాబాద్ 39.5, నిజాంసాగర్ 39, బాన్సువాడ, సదాశివనగర్, డోంగ్లిలో 38, భిక్నూర్ 37.9, పిట్లంలో 37.7 ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.

Similar News

News April 7, 2025

BREAKING: పరీక్ష తేదీలు వచ్చేశాయ్

image

AP: పలు పోటీ పరీక్షల తేదీలను APPSC ప్రకటించింది. పాలిటెక్నిక్, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల భర్తీకి సంబంధించి జూన్ 16 నుంచి 26వ తేదీ వరకు CBT విధానంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపింది. రోజూ రెండు షిఫ్టుల్లో పరీక్షలు జరుగుతాయని, జూన్ 20 నుంచి 22 వరకు పరీక్షలు జరగవని పేర్కొంది. పరీక్షల షెడ్యూల్ కోసం ఇక్కడ <>క్లిక్ <<>>చేయండి.

News April 7, 2025

సింగపూర్ కాన్సులేట్‌తో ఐటీ మంత్రి సమావేశం

image

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, సింగపూర్ కాన్సులేట్ జనరల్ ఎడ్గర్ పాంగ్‌తో సోమవానం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తెలంగాణను ‘ఎమర్జింగ్ టెక్నాలజీస్’ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఆయన వివరించారు. రాష్ట్రం నుంచి రెండు లక్షల మంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఇంజినీర్లను సిద్ధం చేయడం తమ ప్రధాన లక్ష్యమని శ్రీధర్‌బాబు తెలిపారు.

News April 7, 2025

విశాఖలో ఏసీబీ దాడులు

image

జ్ఞానాపురంలోని జీవీఎంసీ జోన్- 5 కార్యాలయంలో సోమవారం ఏసీబీ దాడులు జరిగాయి. మరణ ధ్రువీకరణ పత్రానికి రూ.40,000 లంచం అడిగిన డేటా ఆపరేటర్ చంద్రశేఖర్, ఔట్‌సోర్సింగ్ సూపర్వైజర్ వెంకటరమణను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యడెండ్‌గా పట్టుపడ్డారు. ప్రస్తుతం కార్యాలయంలో రికార్డులు తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

error: Content is protected !!