News February 24, 2025

కామారెడ్డి: హామీల అమల్లో సీఎం మోసం: ఎంపీ

image

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేశాడని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. కామారెడ్డిలో ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని అన్నారు.

Similar News

News February 24, 2025

నిజామాబాద్: రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత KCRకు లేదు: TPCC చీఫ్ 

image

విజన్ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే అర్హత ఫామ్ హౌస్‌లో పడుకునే KCRకు లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి తాను పరిగెత్తుతూ మంత్రులను పరిగెత్తిస్తున్నారని, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి ధైర్యం ముఖ్యమని, ఆ ధైర్యం రేవంత్ రెడ్డికి గుండె నిండా ఉందని పేర్కొన్నారు.

News February 24, 2025

కోహ్లీ ఊచకోత.. పాకిస్థానీ ట్వీట్ వైరల్!

image

పాకిస్థాన్‌తో మ్యాచ్ అనగానే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ పూనకంతో సెంచరీల మోత మోగిస్తుంటారు. నిన్న కూడా CTలో పాకిస్థాన్‌తో మ్యాచులో సెంచరీతో ఇండియాను గెలిపించారు. అయితే, కోహ్లీ బ్యాటింగ్‌పై ఓ పాకిస్థానీ తన ఆవేదనను వెళ్లగక్కారు. ‘ఈ విరాట్ కోహ్లీ ఎప్పుడూ మనపైనే ఎందుకు ఎక్కువ కసిగా ఆడతాడు. మనం అతడిని ఏమైనా బాధపెట్టామా? మనమేం చేశాం’ అని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి మీరు COMMENTలో సమాధానం చెప్పండి.

News February 24, 2025

MDK: నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్

image

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ముస్సోరిలోని నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అకాడమిలో వివిధ దేశాల సివిల్ సర్వీస్ అధికారులకు మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అతిధి ఉపన్యాసం ఇచ్చారు. ఈ సంద్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ మన రాష్ట్రంలో అమలవుతున్న స్థానిక పాలనపై సుదీర్ఘంగా తన అనుభవాలను పంచుకున్నామని అన్నారు. వాళ్లందరికీ కొన్ని విలువైన సలహాలు సూచనలు చేశామని తెలిపారు.

error: Content is protected !!