News September 25, 2024

కామారెడ్డిలో నూతన ఎంఈఓలు వీరే

image

కామరెడ్డి జిల్లాలోని పలు మండలాలకు నూతన ఎంఈఓలను విద్యాశాఖ మంగళవారం నియమించింది. మాచారెడ్డి-దేవేందర్ రావు, లింగంపేట్-షౌకత్, బీర్కూర్-వెంకన్న, జుక్కల్-తిరుపతయ్య, రాజంపేట్-పూర్ణ చందర్, రామారెడ్డి-ఆనందరావు, నిజాంసాగర్-తిరుపతి రెడ్డి, నాగిరెడ్డిపేట్-భాస్కర్ రెడ్డి, నస్రుల్లాబాద్-చందర్, బిబిపేట్-అశోక్, దోమకొండ-విజయ్ కుమార్, పాల్వంచ-జేతాలాల్, గాంధారి-శ్రీహరిని నియమించినట్లు ఉత్తర్వులు వచ్చాయి.

Similar News

News September 29, 2024

NZB: ఈనెల 30న జిల్లాకు రానున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

image

నిజామాబాద్ జిల్లాకు ఈనెల 30న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రానున్నారు. పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. ఆర్మూర్ పట్టణంలో నూతనంగా నిర్మించిన ఎక్సైజ్ శాఖ కార్యాలయాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారని ఎక్సైజ్ SHO స్టీవెన్ సన్ తెలిపారు. అలాగే మోర్తాడ్ మండల కేంద్రంలోనూ ఎక్సైజ్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారని ఎక్సైజ్ సీఐ గుండప్ప తెలిపారు.

News September 28, 2024

NZB: ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో నిద్రించిన కలెక్టర్

image

నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం పోచంపాడ్ లోని ప్రభుత్వ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం రాత్రి నిద్రించారు. రాత్రి రెసిడెన్షియల్ స్కూల్‌ను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్, రోజువారీ దినచర్య, మెనూ, స్టడీ అవర్స్ కొనసాగుతుండడాన్ని గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజన, వసతి సదుపాయాలు, విద్యా బోధన, తదితర వివరాలను పాఠశాల ప్రిన్సిపల్‌ను అడిగి తెలుసుకున్నారు.

News September 28, 2024

TU: బ్యాక్ లాగ్ పరీక్షల రీవాల్యుయేషన్ షెడ్యూల్ ప్రకటన

image

తెలంగాణ విశ్వవిద్యాలయ పరిధిలోని పీజీ బ్యాక్ లాగ్ పరీక్షల రీవాల్యుయెషన్ షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణ అధికారిణి ఆచార్య ఎం.అరుణ శనివారం వెల్లడించారు. బ్యాక్ లాగ్ పీజీ విభాగం,LLB I,III,IV,V సెమిస్టర్ బ్యాక్ లాగ్ మరియు VI రెగ్యులర్ బ్యాక్ లాగ్ పరీక్షలకు హాజరైన వారు మాత్రమే అర్హులన్నారు. ఒక్కో పెపర్ రూ.500 చెల్లించవలసి ఉండగా, అక్టోబర్ 1లోపు చెల్లించవచ్చని పేర్కొన్నారు.