News March 26, 2025
కార్వేటి నగరం: రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

బొలెరో వాహనం ఢీకొని కార్వేటి నగరం మండలానికి చెందిన యువకుడు మంగళవారం మృతి చెందారు. స్థానికుల కథనం మేరకు.. కేపీ అగ్రహారానికి చెందిన రవి(26) తిరుపతిలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని బైకుపై వస్తుండగా వెదురుకుప్ప మండలం చిన్నపోడు చేను సమీపంలో ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. అతనిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Similar News
News March 31, 2025
చిత్తూరు: శ్రీవారి భక్తుడు మృతి

ఈ నెల 24న తిరుపతి భూదేవి కాంప్లెక్స్లోని టాయిలెట్లో కాలు జారిపడిన శ్రీవారి భక్తుడిని అధికారులు రూయ ఆసుపత్రిలో చేర్పించారు. రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ భక్తుడు ఆదివారం మృతి చెందాడు. మృతి చెందిన వ్యక్తి ఒంగోలుకు చెందిన వీరాంజనేయులుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని రుయా మార్చురీకి తరలించారు. వీఆర్వో ఫిర్యాదు మేరకు అలిపిరి ఎస్సై అజిత కేసు నమోదు చేశారు.
News March 30, 2025
మసీదుల వద్ద పటిష్ఠ భద్రత: చిత్తూరు జిల్లా ఎస్పీ

రంజాన్ సందర్భంగా ఉపవాస దీక్షలు పాటిస్తూ ముస్లిం సోదరులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఈద్-ఉల్-ఫితర్ పండుగను ప్రేమ, శాంతి, సౌహార్దంతో జరుపుకోవాలని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు కోరారు. అనంతరం మసీదుల వద్ద పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ప్రజలు ప్రశాంతంగా ప్రార్థనలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు.
News March 30, 2025
చిత్తూరు: రేషన్ ఈ-కేవైసీకి గడువు పెంపు

రేషన్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ చేసుకునేందుకు ప్రభుత్వం గడువు పెంచినట్లు డీఎస్ఓ శంకరన్ తెలిపారు. ఏప్రిల్ 30వ తేదీలోపు రేషన్ కార్డుదారులు ఈకేవైసీ చేయించుకోవచ్చని సూచించారు. ఇప్పటి వరకు 17 లక్షల మంది వరకు ఈకేవైసీ చేయించుకున్నారని, ఇంకా చేయించుకోవాల్సిన వారు 1.50 లక్షల మంది మిగిలారని వివరించారు.