News March 4, 2025
కాల్వ శ్రీరాంపూర్: ఇంట్లో బంగారం చోరీ కలకలం

కాల్వ శ్రీరాంపూర్ మండలం చిన్నరాతుపల్లి గ్రామానికి చెందిన మద్దెల కాంతమ్మ అనే వృద్ధురాలి ఇంట్లో చోరీ కలకలం రేపుతోంది. తమ వీధిలో జరుగుతున్న ఓ వివాహ కార్యక్రమానికి వెళ్లి వచ్చే సరికి ఇంట్లో బీరువా లాకరు ధ్వంసం చేసి 9 తులాల బంగారాన్ని గుర్తు తెలియని దుండగులు అపహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి ఎస్ఐ వెంకటేష్ చేరుకొని పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 4, 2025
VJA: ఎమ్మెల్యే సుజనాకు స్పీకర్ కితాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంగళవారం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ MLA సుజనా చౌదరి బడ్జెట్పై కూలంకషంగా మాట్లాడారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. చాలా బాగా మాట్లాడారని కితాబిచ్చారు. దీంతో సుజనా మాట్లాడుతూ.. సభకు అటెండెన్స్ మరింత పెరిగితే బాగుంటుందని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
News March 4, 2025
ఆగ్రహం వ్యక్తం చేసిన బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని మేజర్ కాలవ కట్టపై చెత్త వేయడం పట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువ కట్టను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, కట్టను సంరక్షించాలని ఆదేశించారు.
News March 4, 2025
బండ్లమ్మ సేవలో బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం చందోలు బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.