News February 26, 2025

కాళేశ్వరంలో పూజలు చేసిన మాజీ మంత్రి

image

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి వారి ఆలయంలో జరుగుతున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. వీరు ఆలయం వద్దకు రాగా ఆలయ అర్చకులు మర్యాదపూర్వక స్వాగతం పలికారు. ఆలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి ఆలయంలో దర్శించుకున్నాక ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేశారు. మీరు వెంట మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, నాయకులు రాకేశ్ తదితరులు ఉన్నారు.

Similar News

News February 27, 2025

చిన్న మెట్‌పల్లిలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య

image

కోరుట్ల మండలం చిన్న మెట్‌పల్లి గ్రామానికి చెందిన మోత్కూరు సంజయ్ అనే విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న సంజయ్ చదువులో వెనక పడటంతో పరీక్షల్లో ఫెయిల్ అవుతాననే భయంతో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News February 27, 2025

ఏడుపాయలలో తెలంగాణ జానపదుల సమ్మేళనం

image

ఏడుపాయల మహా జాతర అంటే తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం ఉట్టిపడుతుంది. నెత్తిన బోనం, శివసత్తుల పూనకాలతో అమ్మవారి ప్రాంగణం వన దుర్గ మాత నామస్మరణతో పోరెత్తుతోంది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు అమ్మవారి మొక్కలు చెల్లించుకోవడానికి ముందుకు సాగుతున్నారు. బోనాలతో ప్రదర్శనగా వెళ్లి అమ్మవారికి మొక్కులు సమర్పిస్తున్నారు.

News February 27, 2025

వర్గల్: వివాహేతర సంబంధంతో మహిళ హత్య

image

వర్గల్ మండలం అనంతగిరిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ(40)తో అదే గ్రామానికి చెందిన బండ్ల చిన్న లక్ష్మయ్య మధ్య పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈనెల 15న గజ్వేల్ పరిధిలోని కోమటిబండ అటవీ ప్రాంతంలోకి మహిళను తీసుకెళ్లి పురుగు మందు కలిపిన కల్లు తాగించాడు. ఆ తరువాత మెడకు చీరతో ఉరేసి చంపినట్లు గజ్వేల్ ఏసీపీ పురుషోత్తం రెడ్డి వివరాలను వెల్లడించారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!