News February 7, 2025
కాళ్ల: స్థల వివాదమే హత్యకు కారణం

కాళ్ల మండలం పెదఅమిరం గ్రామంలో తమ్ముడిని అన్న హత్య చేసిన ఘటనకు స్థలం గొడవే కారణంగా తెలుస్తోంది. తమ తల్లికి చెందిన సెంటు స్థలం కోసం అన్న రమేశ్, తమ్ముడు సత్యనారాయణ మధ్య వివాదం నడుస్తోంది. 2023లో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకుని రాజీ పడ్డారు. ఆ తర్వాత కూడా గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం సాయంత్రం అన్న ఇంటికి వెళ్లి రమేశ్ గొడవపడ్డాడు. సత్యనారాయణ తలపై బలంగా కొట్టడంతో రమేశ్ మృతి చెందాడు. కేసు నమోదైంది.
Similar News
News April 21, 2025
ప.గో: పోలీస్ శాఖ పీజీ ఆర్ఎస్కు 23 అర్జీలు

ప.గో జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్కు 23 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపించి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు.
News April 21, 2025
అనకాపల్లి: బాబోయ్ అడ్మిషన్లా..? భయపడిపోతున్న ప్రైవేట్ టీచర్స్!

అనకాపల్లి జిల్లాలో రాబోయే విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ప్రైవేట్ స్కూల్ టీచర్లు పరుగులు పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో టార్గెట్లు ఇవ్వడంతో ఒత్తిడికి గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మినిమం అడ్మిషన్లు తీసుకురావాలని హుకుం జారీ చేయడంతో మండుటెండల్లో రోడ్ల వెంట పరుగులు పెడుతున్నారు. విద్యా సంవత్సరం మారుతున్న ప్రతిసారి ఇదే పరిస్థితి అంటూ వాపోతున్నారు. మీ కామెంట్?
News April 21, 2025
ఉమ్మడి ప.గో జిల్లాలో డీఎస్సీ పోస్టుల కేటాయింపు ఇలా..

డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఉమ్మడి ప.గో జిల్లాలో 1035 పోస్టులు భర్తీ చేయనున్నారు. రోస్టర్ వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
➣OC-421, ➣BC-A: 75, ➣BC-B: 102, ➣BC-C:10, ➣BC-D:68, ➣BC-E: 39, ➣SC గ్రేడ్1- 20, ➣SC గ్రేడ్2- 64, ➣SC గ్రేడ్3- 77, ➣ST- 61, ➣EWS- 98 పోస్టులు కేటాయించారు.