News April 21, 2025

కురుపాం: చేపల మృత్యువాతపై స్పందించిన అధికారులు

image

కురుపాం మండల కేంద్రంలో ఉన్న సంత కోనేరు చెరువులో డ్రైన్ వాటర్ చేరి నీరు కలుషితమై చేపలు చనిపోవడంతో Way2Newsలో కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన మత్స్యశాఖ, పంచాయతీ అధికారులు తక్షణమే చెరువులోకి మురుగు వెళ్లకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పంచాయతీ కార్యదర్శి వెంకట్ నాయుడు తెలిపారు. అలాగే ఘటన స్థలాన్ని పంచాయితీ అధికారులు ఉపసర్పంచ్ ఆదిల్ పరిశీలించారు. రైతులకు న్యాయం చేస్తారని హామీ ఇచ్చారు.

Similar News

News April 21, 2025

తర్వాతి పోప్ అయ్యే ఛాన్స్ వీరికే!

image

పోప్ ఫ్రాన్సిస్ గతించడంతో ఆయన స్థానంలో తర్వాతి పోప్ ఎవరా అన్న ఆసక్తి ప్రపంచవ్యాప్తంగా నెలకొంది. ఐదుగురి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వారు..
* లూయిస్ టగ్లే(ఫిలిప్పీన్స్)
* పియెట్రో పారోలిన్(ఇటలీ)
* జీన్-మార్క్ అవెలీన్(ఫ్రాన్స్)
* విలెమ్ ఐజ్క్(నెదర్లాండ్స్)
* మాల్కమ్ రంజిత్(శ్రీలంక)

News April 21, 2025

సిద్దిపేట: ప్రజావాణికి 44 దరఖాస్తులు

image

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఎం.మనుచౌదరి అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం ఫిర్యాదుదారుల నుంచి కలెక్టర్ దరఖాస్తులను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా అధికారులను ఆదేశించారు. మొత్తం 44 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.

News April 21, 2025

BREAKING: గ్రూప్-1 మెయిన్స్ షెడ్యూల్ విడుదల

image

AP: గ్రూప్‌-1 మెయిన్స్ రాత పరీక్షకు ఏపీపీఎస్సీ షెడ్యూల్ విడుదల చేసింది. మే 3 నుంచి 9 వరకు 4 జిల్లా కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. అన్ని పేపర్లకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ పరీక్షలు జరగనున్నాయి. ఈరోజు నుంచే హాల్ టికెట్లను https://psc.ap.gov.in వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

error: Content is protected !!