News December 24, 2024
కృష్ణ: కారు ఢీ కొని.. ప్రభుత్వ టీచర్ దుర్మరణం

మండలంలోని పెడసనగల్లు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న వి.రామకృష్ణను సోమవారం కంకిపాడు టోల్ ప్లాజా వద్ద కారు ఢీ కొట్టింది. గాయాలపాలైన ఆయనను సిటీ న్యూరో సెంటర్కు చికిత్స నిమిత్తం తరలించారు. చికిత్స అందుతుండగా ఆయన మంగళవారం మరణించారని మొవ్వ మండల ఏపీ టీచర్స్ ఫెడరేషన్ తాజాగా ఓ ప్రకటన విడుదల చేసింది. పాఠశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News December 13, 2025
గన్నవరం: పంచాయతీ ఎన్నికలు.. వంశీ వ్యూహంపై ఆసక్తి.!

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ మైనింగ్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు శనివారం గన్నవరం పోలీస్ స్టేషన్లో సంతకాలు చేయడానికి హాజరయ్యారు. రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా నిలిచే వంశీ ఇటీవల పార్టీ సమావేశాల్లో పాల్గొనకపోవడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో, రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల గెలుపు కోసం ఆయన వ్యూహ రచన ఎలా ఉంటుందనే దానిపై ఆసక్తి నెలకొంది.
News December 13, 2025
21న మచిలీపట్నం నుంచి అజ్మీర్కు స్పెషల్ ట్రైన్

అజ్మీర్ ఉరుసు ఉత్సవాలకు వెళ్లేందుకు గాను ఈ నెల 21వ తేదీన మచిలీపట్నం నుంచి అజ్మీర్కు ప్రత్యేక ట్రైన్ను వేసినట్లు ఎంపీ వల్లభనేని బాలశౌరి తెలిపారు. ఆ రోజు ఉదయం 10 గంటలకు మచిలీపట్నం నుంచి బయలుదేరే ఈ స్పెషల్ ట్రైన్ 23వ తేదీ మధ్యాహ్నం 3.30 గంటలకు అజ్మీర్ చేరుకుంటుందన్నారు. 28వ తేదీ అజ్మీర్ నుంచి బయలుదేరి 30వ తేదీ ఉదయం 9.30గంటలకు తిరిగి మచిలీపట్నం చేరుకుంటుందని చెప్పారు.
News December 12, 2025
కృష్ణా: నవోదయ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతి ప్రవేశ పరీక్ష (JNVST-2026) శనివారం జిల్లా వ్యాప్తంగా జరగనుంది. మొత్తం 17 కేంద్రాల్లో 1,894 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) యు.వి. సుబ్బారావు తెలిపారు. పరీక్షను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీఈఓ వెల్లడించారు.


