News June 17, 2024

కృష్ణా: CM చంద్రబాబు, డిప్యూటీ CM పవన్ ఫొటోలతో ర్యాలీ చేసిన మంత్రి

image

నూజివీడు నియోజకవర్గం నుంచి TDPతరఫున MLAగా గెలిచిన కొలుసు పార్థసారథికి సమాచార శాఖ, గృహనిర్మాణ మంత్రి పదవి దక్కిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నియోజకవర్గానికి సోమవారం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన నూజివీడులో పార్టీ శ్రేణులు నిర్వహించి ర్యాలీలో పాల్గొన్నారు. అభిమానులు ఆయనకు CM చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫొటోలు ఇవ్వగా అవి పట్టుకొని ర్యాలీగా ముందుకుసాగారు.

Similar News

News October 3, 2024

తిరువూరు: శావల దేవదత్‌కు శుభాకాంక్షల వెల్లువ

image

తిరువూరు నియోజకవర్గ మాజీ ఇన్‌ఛార్జ్ టీడీపీ నేత శావల దేవదత్ గురువారం స్థానిక నియోజకవర్గ పార్టీ కార్యాలయాన్ని పున:ప్రారంభించారు. ఎమ్మెల్యే కొలికపూడి వివాదం నేపథ్యంలో తిరువూరు నియోజకవర్గ బాధ్యతలు దేవదత్‌కు అప్పగిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన పార్టీ శ్రేణులు పార్టీ కార్యాలయానికి అధిక సంఖ్యలో చేరుకుని శుభాకాంక్షలు తెలియజేశారు.

News October 3, 2024

VJA: ముంబై నటి కేసులో కీలక అప్డేట్

image

ముంబై నటి జెత్వానీ కేసులో తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఐపీఎస్ అధికారులతో పాటు పోలీస్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో నేడు విచారణ జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు తొందరపాటు చర్యలు వద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం పొడిగింపు చేసింది. ఇవే ఆదేశాలు కేసులో ముద్దాయిలుగా ఉన్న ఏసీపీ, సీఐలకు వర్తిస్తాయని హైకోర్టు పేర్కొంది.

News October 3, 2024

విజయవాడ దుర్గమ్మ బంగారు కిరీటాన్ని చూశారా

image

విజయవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాత భక్తుడు ఇటీవల బంగారు కిరీటాన్ని అందజేశారు. రూ.2.5 కోట్లతో బంగారం, వజ్రాలతో తయారు చేసిన ఈ కిరీటాన్ని గురువారం కనకదుర్గమ్మ వారికి అర్చకులు అలంకరించారు. బాలా త్రిపుర సుందరి దేవిగా నేడు అలంకరించిన కనకదుర్గమ్మ అమ్మవారు ఈ కిరీటంతో భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అర్చకులు చెప్పారు.