News March 12, 2025
కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్లో మార్పులు

విజయవాడ, కొండపల్లి మీదుగా తిరుపతి(TPTY)- ఆదిలాబాద్(ADB) మధ్య ప్రయాణించే కృష్ణా ఎక్స్ప్రెస్ ప్రయాణించే రూట్లో రైల్వే శాఖ మార్పులు చేసింది. సికింద్రాబాద్ స్టేషన్లో అభివృద్ధి పనులు చేస్తున్నందున నం.17405 TPTY- ADB రైలు ఈ నెల 26, నం.17406 ADB- TPTY రైలు ఈ నెల 27 నుంచి ఆ స్టేషన్లలో ఆగదని రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లను పై తేదీల నుంచి చర్లపల్లి మీదుగా నడుపుతున్నామన్నారు.
Similar News
News March 12, 2025
రెవెన్యూ అంశాలపై పట్టు పెంచుకొవాలి: కలెక్టర్

మచిలీపట్నం కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో బుధవారం జిల్లా కలెక్టర్, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్ఓ కే చంద్రశేఖరరావు, కె ఆర్ ఆర్ సి. ఎస్.డి.సి శ్రీదేవితో కలిసి రెవెన్యూ అధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కార వేదిక పురోగతి, రీ సర్వే, గ్రామ, వార్డు సచివాలయాల సేవలు తదితర రెవెన్యూ అంశాలపై దిశానిర్దేశం చేశారు.
News March 12, 2025
బీసీ స్టడీ సర్కిల్లో ఫ్రీ కోచింగ్.. అప్లై ఇలా

TG: BC స్టడీ సర్కిల్లో బ్యాంకింగ్&ఫైనాన్స్లో నెల రోజుల పాటు నాన్ రెసిడెన్షియల్ ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. డిగ్రీ పాసై 26yrsలోపు వయసున్న బీసీలు అర్హులు. మార్చి 15- ఏప్రిల్ 8 వరకు https://studycircle.cgg.gov.in/లో అప్లై చేయాలి. APR 12న స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక ప్రైవేట్ బ్యాంక్లలో ఉద్యోగాలు కల్పిస్తారు. ఫోన్: 040-29303130.
News March 12, 2025
VZM: ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వ అదనపు సహాయం

ప్రధానమంత్రి ఆవాస్ యోజన -గ్రామీణ్, అర్బన్, పీఎం జన్మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తిచేసేందుకు ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్ అంబేడ్కర్ వెల్లడించారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి మంజూరు చేసిన మొత్తానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని అందిస్తుందన్నారు.