News April 12, 2025
కృష్ణా: ఎస్సీ కార్పొరేషన్ బ్యాంక్ లింక్ రుణాలకు దరఖాస్తుల ఆహ్వానం

2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుపేద ఎస్సీల స్వయం ఉపాధికై బ్యాంక్ లింకేజీ రుణాలకు సంబంధించి దరఖాస్తులను ఈనెల 14వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన వారు మే 10వ తేదీలోపు https:///apobmms.apcfss.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News April 15, 2025
కృష్ణా: మచిలీపట్నంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల అందజేత

పేదలకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. నియోజకవర్గంలో మొత్తం 19 మందికి రూ.16.68లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయ్యాయి. ఈ చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.
News April 14, 2025
మచిలీపట్నం: అంబేడ్కర్కు నివాళులర్పించిన కొల్లు

మచిలీపట్నంలో సోమవారం అంబేడ్కర్ జయంతి ఉత్సవాన్ని నిర్వహించారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ గంగాధరరావు, నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ, తదితరులు లక్ష్మీటాకీస్ సెంటర్లోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
News April 14, 2025
విజయవాడలో రోప్ వే.. ఈసారి కన్ఫామ్

భవానీ ఐలాండ్కు రోప్వే కల సాకారమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఎదురైన భౌగోళిక, ఆధ్యాత్మిక అడ్డంకులను దృష్టిలో ఉంచుకుని, ఈసారి హరిత బర్మా పార్క్ నుంచి నేరుగా భవానీ ద్వీపం వరకూ 0.88 కి.మీ దూరంలో రోప్వే ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందిస్తోంది. త్వరలో బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని ప్రాజెక్టును PPP విధానంలో అప్పగించనున్నారు.