News June 22, 2024
కృష్ణా జిల్లాలో 2 నెలల పాటు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’
జిల్లాలో డయేరియా నివారణకు జూలై 1 నుంచి ఆగస్ట్ 31వ తేదీ వరకు ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహించనున్నట్టు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత శాఖల అధికారులతో సమావేశమైన కలెక్టర్ ‘స్టాప్ డయేరియా క్యాంపైన్’ నిర్వహణకు అవసరమైన కార్యాచరణ తయారు చేయాలని ఆదేశించారు. తాగునీటి కాలుష్యం జరగకుండా ఓవర్ హెడ్ ట్యాంక్లను పరిశీలించి క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News October 5, 2024
నూజివీడు ట్రిపుల్ ఐటీకి 6 నుంచి దసరా సెలవులు
రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలో ఉన్న నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు ఈనెల 6 నుంచి 13 వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఆచార్య అమరేంద్ర కుమార్ శనివారం తెలిపారు. తిరిగి ట్రిపుల్ ఐటీలు ఈనెల 14 నుంచి పునః ప్రారంభమవుతాయని చెప్పారు. నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు దూర ప్రాంతాల్లోని తమ ఇళ్లకు వెళ్లేందుకు 45 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశామన్నారు.
News October 5, 2024
కృష్ణా: ఫీజు చెల్లింపు గడువు పొడిగింపు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ (ఇయర్ ఎండ్) వన్ టైం ఆపర్చ్యూనిటీ పరీక్షల ఫీజు చెల్లింపు గడువును పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఫీజు చెల్లింపు గడువు అక్టోబర్ ఒకటితో ముగియగా ఆ గడువును ఈ నెల 30 వరకు పొడిగించామని వర్శిటీ పరీక్షల విభాగం తెలిపింది. ఈ పరీక్షలు రాసే విద్యార్థులు అపరాధ రుసుము లేకుండా ఈ నెల 30లోపు ఫీజు చెల్లించాలని సూచించింది.
News October 5, 2024
నేడు పార్టీ అధిష్ఠానం వద్దకు కొలికపూడి
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై పలువురు చేసిన ఆరోపణలు నియోజకవర్గంలో చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ మేరకు టీడీపీ అధిష్ఠానం ఆయన్ను వివరణ కోరనుంది. ఇదే సమయంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు శావల దేవదత్కు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొలికపూడిని ఇవాళ మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయానికి రావాలని అధిష్ఠానం ఆదేశించింది.