News February 18, 2025

కృష్ణా: డిగ్రీ పరీక్షల టైం టేబుల్ విడుదల

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ(ANU) పరిధిలో బీఏ(మల్టీమీడియా) కోర్స్ విద్యార్థులు రాయాల్సిన 7వ సెమిస్టర్ థియరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 1, 3, 4,5 తేదీలలో ఈ పరీక్షలు జరుగుతాయని ANU పరీక్షల విభాగ కంట్రోలర్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. టైం టేబుల్ పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ వెబ్‌సైట్ చూడాలని సూచించారు.

Similar News

News February 21, 2025

కృష్ణాజిల్లా నేటి ముఖ్యాంశాలు

image

*కృష్ణా: డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని. *కృష్ణాజిల్లా పోలీసులను అభినందించిన హోంమంత్రి. *కృష్ణా జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు. *అమలాపురం లాడ్జిలో పోరంకి డాక్టర్ మృతి. * ఉయ్యూరులో మద్యం మత్తులో వీరంగం. *కృష్ణా: APK ఫైల్ క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతా ఖాళి. *గన్నవరం: వంశీ కేసులో పిటిషన్ వాయిదా.

News February 21, 2025

డీజీపీకి లేఖ రాసిన పేర్ని నాని

image

డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు మాజీ మంత్రి పేర్నినాని లేఖ రాశారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని డీజీపీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అక్రమ కేసుల వెనుక ఉన్న కోణాన్ని తెలుసుకోవాలని, బాధ్యతారహితంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డీజీపీని కోరారు.

News February 21, 2025

కృష్ణాజిల్లా పోలీసులకు హోం మంత్రి అభినందనలు

image

కృష్ణాజిల్లా పోలీసులను హోం మంత్రి అనిత అభినందించారు. ఈ సందర్భంగా ఆమె ఎక్స్ వేదికగా ప్రశంసించారు. కృష్ణా జిల్లాలోని గన్నవరం మండలం ముస్తాబాద్ బాలికలు అదృశ్యమైన ఘటనలో పోలీసుల స్పందించిన తీరును ఆమె మెచ్చుకున్నారు. కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ రావు, సత్తెనపల్లి DSP, సీఐలకు ఫోన్ చేసి అభినందించినట్లు ఆమె Xలో పోస్ట్ చేశారు. 

error: Content is protected !!