News July 30, 2024

కృష్ణా నదిలో పడవలు నడపవద్దు: శ్రీశైలం సీఐ నోటీసులు

image

శ్రీశైలం డ్యామ్‌కు కృష్ణానది పరీవాహక ప్రాంతాల నుంచి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుండటంతో శ్రీశైలం పోలీసులు అప్రమత్తమయ్యారు. జలాశయం బ్యాక్ వాటర్‌లో పడవలు నడపొద్దు అంటూ ఏపీ టూరిజం మేనేజర్‌కు, స్థానిక మత్స్యకార బోట్ ఆపరేటర్లకు శ్రీశైలం సీఐ ప్రసాదరావు నోటీసులు అందజేశారు. వరద ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోందని, సందర్శకుల శ్రేయస్సు దృష్ట్యా నోటీసులు జారీ చేశామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పన్నారు.

Similar News

News October 8, 2024

స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన: మంత్రి భరత్

image

ఐదేళ్ల అభివృద్ధి లక్ష్యాలతో స్వర్ణాంధ్ర@2047 డాక్యుమెంట్ రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కలెక్టరేట్లో స్వర్ణాంధ్ర @2047 జిల్లా దార్శనిక ప్రణాళిక (2024-29) రూపకల్పనపై సమావేశం నిర్వహించారు. ఓర్వకల్ ఇండస్ట్రియల్ హబ్ గ్రోత్ ఇంజిన్ అని, దీని వల్ల జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించనున్నామని తెలిపారు. దాదాపుగా రూ.2,800 కోట్లతో ఓర్వకల్లు నోడ్ అభివృద్ధి కానుందని తెలిపారు.

News October 7, 2024

ఉమ్మడి కర్నూలు జిల్లాలో 519 దరఖాస్తులు!

image

ఉ.కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. ఇప్పటివరకు నంద్యాల జిల్లాలో 105 మద్యం దుకాణాలకు గానూ 217, కర్నూలు జిల్లాలో 99 దుకాణాలకు గానూ 302 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుల స్వీకరణకు ఇక మూడు రోజులే గడువుంది. అయితే జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ముఖ్యనేతలు మద్యం దుకాణాలకు ఎవరూ దరఖాస్తులు వేయొద్దని, వాటిని తమకు వదిలేయాలని వ్యాపారులను హెచ్చరిస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి.

News October 7, 2024

కర్నూలు: కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి భారీ కుంభకోణం?

image

కర్నూలు కాల్వబుగ్గ దేవాదాయ శాఖ అధికారి చేతివాటం ప్రదర్శించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. కాగా ఆయన ప్రస్తుతం వేరే ప్రాంతానికి బదిలీ అవ్వగా అసలు విషయాలు బయటపడ్డాయి. ఆయన ఆలయం పేరిట సొంత ఖాతా తెరచి రూ.1.30 కోట్లు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. బినామీలు, సిబ్బంది పేరిట డబ్బులు విత్ డ్రా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.