News October 15, 2024

కృష్ణానది తీరంలో 22న భారీ డ్రోన్ షో

image

కృష్ణా న‌ది తీరంలో 22న నిర్వ‌హించే భారీస్థాయి డ్రోన్‌షో, లేజర్ షో ఏర్పాట్ల‌కు పెట్టుబ‌డులు, మౌలిక స‌దుపాయాల శాఖ కార్య‌ద‌ర్శి సురేష్ కుమార్‌, జిల్లా క‌లెక్ట‌ర్ సృజ‌న‌ వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి పున్నమీ ఘాట్ వద్ద క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించారు. రాష్ట్రాన్ని డ్రోన్ క్యాపిట‌ల్‌గా తీర్చిదిద్దే ఈ కార్యక్రమానికి కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నట్లు తెలిపారు.

Similar News

News October 15, 2024

VJA: మహిళా కానిస్టేబుల్ ఘటనపై ఏసీపీ స్పందన

image

విజయవాడలో మాచవరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ భవాని నిద్ర మాత్రలు మింగి గత రాత్రి ఆత్మహత్యకు యత్నించిన <<14360479>>విషయం తెలిసిందే<<>>. ఈ ఘటనపై సెంట్రల్ ఏసీపీ దామోదర్ స్పందించారు. భవాని ఆరోగ్యం స్థిమితంగానే ఉందన్నారు. సీఐ ప్రకాశ్ వేధించారనడం అవాస్తవమన్నారు. భవాని శాఖ పరంగా డ్యూటీ డ్రెస్ కోడ్ పాటించాలని హెచ్చరించినందుకు ఆమె ఆత్మహత్యకు యత్నించిందన్నారు.

News October 15, 2024

విజయవాడలో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

image

విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కానిస్టేబుల్ ఓపి విధులు నిర్వహిస్తున్నారు. నిన్న రాత్రి నిద్ర మాత్రలు మింగి సూసైడ్‌కు యత్నించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలయాల్సి ఉంది.

News October 15, 2024

కృష్ణా: మద్యం షాపుల లాటరీలో ఆసక్తికర విశేషాలు

image

➢ ఎన్టీఆర్ జిల్లాలో 20 మంది మహిళలకు దుకాణాలు
➢ పెనుగంచిప్రోలులోని 5 షాపుల్లో 3 షాపులు తెలంగాణ వారికే.
➢ పెనుగంచిప్రోలు పెట్రోల్ బంకులో పనిచేసే బాయ్‌కు షాపు.
➢ బాపులపాడుకు చెందిన పరుచూరి నరేశ్‌కు 4 షాపులు.
➢ గుడివాడకు చెందిన రామకృష్ణ మూడు షాపులు కైవసం
➢ మచిలీపట్నంలోని రెండు షాపులు ఢిల్లీ, బెంగళూరుకు చెందిన వారికి దక్కాయి.
➢ మధ్యప్రదేశ్‌కు చెందిన ఒకే కుటుంబంలోని వారికి విజయవాడలో రెండు షాపులు.