News February 2, 2025
కేంద్ర బడ్జెట్లో ఏపీకి అన్యాయం: అనంత వెంకటరామిరెడ్డి

కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగిందని అనంతపురం జిల్లా YCP అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ఆరోపించారు. వ్యవసాయ రంగానికి ఊతమిచ్చేలా ఎలాంటి ప్రకటన చేయకపోవడం బాధాకరమన్నారు. ఏపీకి జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టును 41.15 మీటర్ల వరకు నీరు నిలిపేలా నిర్మాణం చేయనున్నట్లు కేంద్రం స్పష్టం చేసినా కూటమి నాయకులు మాట్లాడకపోవడం దారుణమని పేర్కొన్నారు.
Similar News
News April 25, 2025
మలేరియా అంతం మనతోనే: DMHO దేవి

ఏప్రిల్ 25 ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా, DMHO కార్యాలయంలో జిల్లా వైద్యాధికారిణి దేవి మలేరియా అంతం మనతోనే’ అనే గోడపత్రికను ఆవిష్కరించారు. వైద్య ఆరోగ్య సిబ్బంది& మునిసిపల్, గ్రామ పంచాయతీ సిబ్బంది పరస్పర సహకారంతో DMHO గురువారం అవగాహన నిర్వహించారు. మలేరియా వంటి ప్రాణాంతక వ్యాధి నుంచి రక్షణ కల్పించాలని తెలిపారు.
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్ను అభినందించారు.
News April 24, 2025
ఉత్తమ అవార్డు అందుకున్న అనంతపురం కలెక్టర్

స్వచ్ఛ ఆంధ్ర (గ్రామీణ) కార్యక్రమాల అమలులో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ అవార్డును అనంతపురం జిల్లా కలెక్టర్ డా.వినోద్ కుమార్ అందుకున్నారు. జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అవార్డును అందజేశారు. గత ప్రభుత్వం పంచాయతీ నిధులన్నీ నిర్వీర్యం చేసిందని పవన్ విమర్శించారు. తాను ఇష్టంతో పంచాయతీరాజ్ శాఖను తీసుకున్నానని చెప్పారు. కలెక్టర్ను అభినందించారు.