News April 8, 2025

కేంద్ర మంత్రికి స్మార్ట్ సిటీ పనుల పురోగతిని వివరించిన కమిషనర్

image

కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ & అర్బన్ ఎఫైర్స్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్మార్ట్ సిటీ అభివృద్ధి పురోగతిపై ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో బల్దియా కమిషనర్ డా.అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. నగరంలో స్మార్ట్ సిటీ కింద చేపట్టి కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనుల పురోగతిని కమిషనర్ మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కి వివరించారు.

Similar News

News April 8, 2025

అగ్నిప్రమాదంలో పవన్ కళ్యాణ్ కుమారుడికి గాయాలు

image

AP: సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో Dy.CM పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ చిక్కుకున్నాడు. స్కూలులో జరిగిన ఈ ప్రమాదంలో చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం తెలిసి పవన్‌ను వెంటనే సింగపూర్ వెళ్లాలని అధికారులు సూచించారు. అయితే కురిడి గ్రామానికి వస్తానని మాటిచ్చానని, ఆ తర్వాతే సింగపూర్ వెళ్తానని పవన్ బదులిచ్చారు.

News April 8, 2025

నార్సింగి : భర్తతో గొడవ భార్య ఆత్మహత్య

image

భర్తతో గొడవ పడి భార్య ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన నార్సింగి మండలంలోని వల్లూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్ఐ అహ్మద్ మోహినోద్దీన్ తెలిపిన వివరాల ప్రకారం.. వల్లూరుకి చెందిన మౌనిక (30)భర్త సురేష్‌తో గొడవ పడి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. భర్త పనికి వెళ్లి వచ్చేసరికి మౌనిక ఈ దుర్ఘటనకు పాల్పడింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెల్లడించారు.

News April 8, 2025

TRADE WAR: ట్రంప్ వార్నింగ్‌ను లెక్కచేయని చైనా

image

US ప్రెసిడెంట్ ట్రంప్ టారిఫ్స్‌కు ప్రతీకారంగా చైనా కూడా 34% సుంకాలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ రేపటిలోగా చైనా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే టారిఫ్స్‌ను 50శాతానికి పెంచుతామని హెచ్చరించారు. ‘టారిఫ్స్‌తో మేమూ నష్టపోతాం. కానీ ఆకాశమేం ఊడిపడదు. తుది వరకు పోరాడుతాం’ అంటూ చైనా ఘాటుగా బదులిచ్చింది. కాగా టారిఫ్స్‌పై భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

error: Content is protected !!