News June 16, 2024

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిని కలిసిన ఆర్మూర్ ఎమ్మెల్యే

image

ఆర్మూర్ MLA పైడి రాకేశ్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధికి సహకారం అందించాలని ఆయన్ను కోరారు. ఎమ్మెల్యేతో పాటు BJP రాష్ట్ర నాయకుడు పెద్దోళ్ల గంగారెడ్డి ఉన్నారు.

Similar News

News October 5, 2024

NZB: GREAT.. ఒకేసారి ఐదు ఉద్యోగాలు

image

నిజామాబాద్ జిల్లాలోని మోపాల్ మండలానికి చెందిన మంచిప్ప గ్రామ యువతి తూర్పు అర్చన ఏకకాలంలో ఐదు ఉద్యోగాలు సాధించింది. ఏఈ, ఏఈఈ, పాలిటెక్నిక్ లెక్చరర్, గ్రూప్-4, టీపీడీఓ ఉద్యోగాలు సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా తూర్పు అర్చన మాట్లాడుతూ.. తాను సివిల్ విభాగంలో ఇంజినీరింగ్ విద్యను పూర్తి చేశారని తన భర్త రాకేష్ సాకారంతో ఇంతటి ఘన విజయాన్ని సాధించారని తెలిపారు.

News October 5, 2024

కలెక్టరేట్లో ఘనంగా జి.వెంకటస్వామి జయంతి వేడుకలు

image

కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నిజామాబాద్ కలెక్టరేట్లో జ్యోతి ప్రజ్వలన చేసి అధికారికంగా జయంతి ఉత్సవాలు జరిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.

News October 5, 2024

NZB: ఆన్లైన్ బెట్టింగ్‌… ముగ్గురు ఆత్మహత్య!

image

ఆన్లైన్ బెట్టింగ్లతో అప్పులపాలై వాటిని తీర్చలేక ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎడపల్లిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. వడ్డేపల్లికి చెందిన రంగననేని సురేష్, హేమలత దంపతుల కుమారుడు హరీశ్.. ఆన్లైన్ బెట్టింగులకు బానిసయ్యాడు. దీంతో ఆ కుటుంబం అప్పులపాలైంది. వాటిని తీర్చేందుకు ఉన్న పొలాన్ని అమ్మివేసినా అప్పు తీరకపోవడంతో ముగ్గురు శుక్రవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.