News April 16, 2025

కైలాసపట్నం: క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమం

image

కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. కేజీహెచ్ సీఎస్ఆర్ బ్లాక్‌లో చికిత్స పొందుతున్న జల్లూరి నాగరాజు, ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మడకల జానకిరామ్‌కు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఈ విషయాన్ని వారి బంధువులు మంగళవారం తెలిపారు. వి.సంతోషి, వి షారోని, వి.రాజును త్వరలో డిశ్చార్జ్ చేయనున్నారు.

Similar News

News April 16, 2025

NLG: హత్యాయత్నం కేసులో ఒకరికి జైలు శిక్ష

image

గిరిజన మహిళపై హత్యాయత్నం చేసిన నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధిస్తూ NLG SC, ST కోర్టు జడ్జి రోజారమణి బుధవారం తీర్పునిచ్చారు. 2018 అక్టోబర్ 13న రాత్రి నాంపల్లిలోని దామెరకు చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన మహేశ్ పత్తి చేలోకి తీసుకెళ్లి ఆమెపై యాసిడ్ పోసి హత్యాయత్నం చేశాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా జడ్జి జైలు శిక్ష విధించారు.

News April 16, 2025

41 రైతు సంఘాలకు డ్రోన్ల పంపిణీ: జేసీ కార్తీక్

image

వ్యవసాయ రంగంలో డ్రోన్ టెక్నాలజీని రైతులు అందిపుచ్చుకోవాలని నెల్లూరు జేసీ కార్తీక్ సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో వ్యవసాయంలో డ్రోన్ టెక్నాలజీ ఉపయోగాలపై రైతులకు అవగాహన కల్పించారు. తక్కువ ఖర్చుతో మెరుగైన ఆదాయం పొందేందుకు శాస్త్ర సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వస్తున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో 41 రైతు సంఘాలకు డ్రోన్స్ ఇస్తున్నట్లు కార్తీక్ పేర్కొన్నారు.

News April 16, 2025

కష్టపడి చదివితే ఇష్టమైన జీవితం: భద్రాద్రి కలెక్టర్

image

విద్యార్థి దశలో కష్టపడి చదివితే ఇష్టమైన జీవితం మన చేతిలోకి వస్తుందని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం పాల్వంచ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసి మాట్లాడారు. కళాశాలలో నిష్ణాణితులైన అధ్యాపక బృందం విశాలమైన తరగతి గదులు క్రీడా ప్రాంగణంతో అన్ని వసతులు కలిగి ఉన్నాయని చెప్పారు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధించారని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

error: Content is protected !!