News March 27, 2025

కొడంగల్: భూమి పూజ చేసిన సీఎం సోదరుడు

image

కొడంగల్ పరిధి మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని రెనివట్ల గ్రామంలో గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల నిర్మాణానికి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతిరెడ్డి భూమి పూజా కార్యక్రమాలను ఈరోజు ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కొడంగల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్‌తో పాటు, కడా ఛైర్మన్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Similar News

News April 1, 2025

సన్న బియ్యం పథకం చారిత్రాత్మకం: ఎమ్మెల్యే సామేలు

image

సన్న బియ్యం పథకం దేశంలోనే చారిత్రాత్మకమని ఎమ్మెల్యే సామేలు అన్నారు. మంగళవారం నాగారం మండలం ఫణిగిరి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులందరూ సన్న బియ్యం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు వెంకన్న యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

News April 1, 2025

బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా కొండముది 

image

బాపట్ల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా అద్దంకికి చెందిన కొండముది బంగారుబాబు ఎన్నికయ్యారు. మంగళవారం బాపట్ల జిల్లా బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఎన్నికల ప్రక్రియలో బంగారు బాబు పేరును ఏకగ్రీవంగా ఎన్నుకొన్నట్లు బీజేపీ ఎన్నికల పరిశీలకులు తెలిపారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ.. సీనియర్ల సూచనల మేరకు ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ బాపట్ల జిల్లాలో బీజేపీని బలోపేతం చేస్తానని తెలిపారు.

News April 1, 2025

ప్రకాశం: పింఛన్ నగదు మాయం

image

పింఛన్ నగదు మాయం కావడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కేతగుడిపి సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ మల్లిక మార్కాపురంలోని బ్యాంక్‌లో శనివారం పింఛన్ నగదు రూ.15.38 లక్షలు విత్ డ్రా చేశారు. ఆటోలో వస్తుండగా పింఛన్ నగదు మాయమైంది. ఈ మేరకు ఆమె మార్కాపురం పోలీస్ స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. సంబంధిత సచివాలయం వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు.

error: Content is protected !!