News February 11, 2025

కొత్తగూడెం: నిర్మానుష్య ప్రదేశంలో గాయాలతో యువతి..?

image

లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి జాతీయ ప్రధాన రహదారి పక్కన గల నిర్మానుష్య ప్రదేశంలో ఓ యువతి గాయాలతో పడి ఉందని స్థానికులు తెలిపారు. గుత్తి కోయ యువతిగా స్థానికులు గుర్తించారు. ఆమెపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తితో దాడి చేసి గాయపరిచారని చెప్పారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికుల సమాచారంతో ఎస్ఐ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 11, 2025

ఖమ్మం జిల్లాలో ఎమ్మెల్సీ ఓటర్లు 4,089 మంది

image

KMM-NLG-WGL టీచర్ MLC ఎన్నికలో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఖమ్మం జిల్లాలో మండలాల వారీగా ఓటర్ల వివరాలు ప్రకటించారు. ఖమ్మం 2474, సత్తుపల్లి 277, మధిర 203, సింగరేణి 177, వైరా 113, కల్లూరు 94, కామేపల్లి 85, ఏన్కూర్ 75, కొణిజర్ల 66, కూసుమంచి 66, వేంసూరు 65, పెనుబల్లి 63, ఎర్రుపాలెం 59, నేలకొండపల్లి 55, రఘునాథపాలెం 41, తల్లాడ 37, చింతకాని 36, ముదిగొండ 35, బోనకల్ 34, తిరుమలాయపాలెం 34 మంది ఉన్నారు.

News February 11, 2025

మధిర: రైలు కిందపడి వ్యక్తి సూసైడ్ 

image

మంగళవారం తెల్లవారుజామున మధిర రైల్వే స్టేషన్ సమీపంలో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల ప్రకారం.. ఏపీ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన ప్రదీప్ కుమార్ జైపూర్- చెన్నై ఎక్స్ ప్రెస్ కిందపడటంతో అతడి తల తెగిపోయింది. లోకో పైలట్ సమాచారంతో ఖమ్మం జీఆర్పి హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

News February 11, 2025

సత్తుపల్లి: కరెంట్ షాక్‌తో మహిళ మృతి 

image

కరెంట్ షాక్‌తో ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన సత్తుపల్లి మండలం కిష్టారంలో మంగళవారం జరిగింది. స్థానికుల వివరాలు.. గ్రామానికి చెందిన పానెం సరస్వతి (50) బట్టలు ఉకితి ఆరేస్తోంది. ఈ క్రమంలో ఐరన్ దండానికి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి షాక్‌కు గురైంది. దీంతో సరస్వతి అక్కడికక్కడే మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం సత్తుపల్లి తరలించారు. ఆమె భర్త 2 నెలల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు.

error: Content is protected !!