News February 13, 2025
కొత్తగూడెంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739422505788_710-normal-WIFI.webp)
భద్రాద్రి కొత్తగూడెంలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. 30 నుంచి 35 డీగ్రీల వరకు నమోదువుతున్నాయి. రాత్రి పూట చలికి.. పగటిపూట ఎండకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందడానికి పండ్ల రసాలు, కొబ్బరి బొండాల వైపు మొగ్గు చూపడంతో వాటి ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. మధ్యాహ్న సమయంలో ఎండ తీవ్రత వల్ల ప్రజలు రోడ్లపైకి రాకపోవడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి.
Similar News
News February 13, 2025
RECORD: 82 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739447011267_746-normal-WIFI.webp)
సాధారణంగా ఒక్క ఆవు మహా అంటే 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటుంది. కానీ, పంజాబ్కు చెందిన ఓ ఆవు ఏకంగా 82 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి జాతీయ రికార్డు సృష్టించింది. లూథియానాలోని 18వ అంతర్జాతీయ PDFA డైరీ & అగ్రి ఎక్స్పోలో హోల్స్టెయిన్ ఫ్రైసియన్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి ఆశ్చర్యపరిచింది. ఇది పంజాబ్ పశువుల పెంపకం, వాటి పాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
News February 13, 2025
MBNR: మహిళలకు గుడ్ న్యూస్.. ఉచిత శిక్షణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739439551498_19518427-normal-WIFI.webp)
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళలకు “SBIRSETI” ఆధ్వర్యంలో ఉపాధి రంగాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ సంస్థ డైరెక్టర్ G.శ్రీనివాస్ తెలిపారు. గురువారం Way2Newsతో ఆయన మాట్లాడుతూ.. బ్యూటీ పార్లర్ & ఎంబ్రాయిడరీలలో 30 రోజులపాటు ఉచిత శిక్షణ ఉంటుందన్నారు. SSC MEMO, ఆధార్, రేషన్ కార్డులతో ఈనెల 17లోపు దరఖాస్తులు చేసుకోవాలని, 19-45 సం.లలోపు ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు 95424 30607కు సంప్రదించాలన్నారు.
News February 13, 2025
సిద్దవటం: హత్యాయత్నం కేసులో ఇద్దరికి 5 ఏళ్ల జైలు శిక్ష
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739448507311_51970327-normal-WIFI.webp)
సిద్దవటం పీఎస్ పరిధిలో 2015 సం.లో జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు ముద్దాయిలకు 5 సం.ల జైలు శిక్ష, అలాగే ఒక్కొక్కరికి రూ. 1,000 జరిమానా విధిస్తూ గురువారం బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జీ పద్మ శ్రీ కోర్టులో తీర్పు ఇచ్చారు. సాక్ష్యాధారాలతో నేర నిరూపణ చేసి, శిక్ష పడేలా కృషి చేసిన కె.రవిచంద్ర APP బద్వేల్, పోలీస్ అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.