News April 7, 2024

కొమురవెల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి ఈరోజు భక్తులు పోటెత్తారు. నేడు ఆదివారం కావడంతో మల్లన్న క్షేత్రానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మల్లన్నకు బోనాలు, పట్నాలు, గంగిరేగు చెట్టుకు ముడుపులు, ప్రదక్షిణలు, అభిషేకం, అర్చనలు చేస్తూ స్వామికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. స్వామి వారి దర్శనానికి 2 గంటలకు పైగా సమయం పడుతుందని భక్తులు చెబుతున్నారు.

Similar News

News October 8, 2024

గౌరవ వందనం స్వీకరించిన మంత్రి కొండా సురేఖ

image

జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి కొండా సురేఖకు స్థానిక కలెక్టర్ సంతోశ్, ఎస్పీ శ్రీనివాసరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి కొండా సురేఖ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై కాసేపు ప్రజాప్రతినిధులతో మంత్రి కొండా సురేఖ చర్చించారు.

News October 8, 2024

వరంగల్ మార్కెట్‌కు వరుస సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి వరుసగా 4 రోజుల సెలవులు రానున్నాయి. ఈనెల 10న దుర్గాష్టమి, 11న మహార్ణవమి, 12న విజయదశమి, వారంతపు యార్డు బంద్, 13న ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్‌ను మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాబట్టి, రైతులు గమనించి 4 రోజులు సరుకులు తీసుకొని రావద్దని విజ్ఞప్తి చేశారు. తిరిగి సోమవారం మార్కెట్ ప్రారంభం అవుతుందన్నారు.

News October 8, 2024

మహాకాళి అవతారంలో గంభీరంగా దర్శనమిస్తున్న అమ్మవారు

image

వరంగల్ నగరవ్యాప్తంగా శ్రీ దుర్గా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పలుచోట్ల ఏర్పాటుచేసిన దుర్గాదేవి ప్రతిమలు నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వరంగల్ బట్టల బజార్లో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన అమ్మవారి వద్దకు భక్తులు తరలివస్తున్నారు. మహాకాళి అవతారంలో గంభీరంగా కనిపిస్తున్న అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తున్నారు.