News February 5, 2025
కొమురవెల్లి: గుండెపోటుతో టీచర్ మృతి
సిద్దిపేట జిల్లాలో గుండెపోటుతో టీచర్ మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. కొమురవెల్లి మండలం మరి ముచ్చాల గ్రామానికి చెందిన అశోక్(50) టీచర్. ఇటీవలే కొమరవెల్లి ZPHS ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేసిన ఆయన దుబ్బాక మండలం దుంపలపల్లి పాఠశాలకు పీఈటీగా బదిలీపై వెళ్లారు. కాగా ఈ ఉదయం ఆయన గుండెపోటుతో చనిపోయారు. భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.
Similar News
News February 5, 2025
బెల్లంపల్లి: ‘కడసారి చూపుకైనా ఇంటికి రండి’
కుటుంబాలను వదిలి అడవుల్లో ఇంకా ఎంతకాలం బ్రతుకంతా వెళ్లదిస్తారు. తాను ఇంకా ఎంతోకాలం బతకనని కడసారి చూపుకైనా ఇంటికి రావాలని మావోయిస్టు నేత పుష్పతల్లి మల్లక్క వేడుకుంది. బుధవారం బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి గ్రామంలోని మావోయిస్టు సభ్యురాలు పుష్ప తల్లి జాడి మల్లక్క, సోదరుడు పోషంను CP శ్రీనివాస్ కలిసి వారిని పరామర్శించారు. మల్లక్క ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.
News February 5, 2025
ఇలా చేస్తే ₹14లక్షల వరకు Zero Income Tax
కొత్త పన్ను విధానంలో ఉన్న ఏకైక మినహాయింపు NPS. సెక్షన్ 80CCD ప్రకారం బేసిక్ శాలరీలో 14% వరకు లబ్ధి పొందొచ్చు. దీనికి ₹75K స్టాండర్డ్ డిడక్షన్ తోడైతే దాదాపుగా ₹14L వరకు పన్ను కట్టాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. Ex. CTC ₹13.75L, బేసిక్ ₹7.16L (CTCలో 50%) అనుకుందాం. అందులో NPS ₹1.1L (బేసిక్లో 14%), SD ₹75K తీసేస్తే మిగిలేది ₹11.9L. ఇది Taxable Income ₹12.1L కన్నా తక్కువే.
News February 5, 2025
1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం
అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.