News March 4, 2025
కొయ్యూరు: భార్య కళ్లెదుటే భర్త మృతి

కొయ్యూరు మండలం నిమ్మలపాలెం సమీపంలో సోమవారం రోడ్డు<<15637815>> ప్రమాదం<<>> లో వ్యకి మృతి చెందిన విషయం తెలిసిందే. వేనం గ్రామానికి చెందిన పాంగి భానుచందర్ తన భార్య జ్యోతితో కలిసి బైక్ వెళ్తుండగా అదుపుతప్పి బోల్తా పడి భానుచందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన జ్యోతిని నర్సీపట్నం ఆసుపత్రికి తరలించారు. కళ్లెదుటే భర్త మృతి చెందడంతో ఆమె గుండెలవిసేలా రోధించింది. ఇది చూసిన స్థానికులు కన్నీరు పెటుకున్నారు.
Similar News
News March 4, 2025
VJA: ఎమ్మెల్యే సుజనాకు స్పీకర్ కితాబు

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై మంగళవారం ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రసంగిస్తున్నారు. ఈ సందర్భంగా విజయవాడ వెస్ట్ MLA సుజనా చౌదరి బడ్జెట్పై కూలంకషంగా మాట్లాడారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. చాలా బాగా మాట్లాడారని కితాబిచ్చారు. దీంతో సుజనా మాట్లాడుతూ.. సభకు అటెండెన్స్ మరింత పెరిగితే బాగుంటుందని అన్నారు. దీంతో సభలో నవ్వులు పూశాయి.
News March 4, 2025
ఆగ్రహం వ్యక్తం చేసిన బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని మేజర్ కాలవ కట్టపై చెత్త వేయడం పట్ల బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చెత్తను తొలగించాలని అధికారులను ఆదేశించారు. కాలువ కట్టను ఆక్రమణలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, కట్టను సంరక్షించాలని ఆదేశించారు.
News March 4, 2025
బండ్లమ్మ సేవలో బాపట్ల కలెక్టర్

పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ భగలాముఖి అమ్మవారి ఆలయంలో బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళవారం ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ నిర్వహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్రం చందోలు బండ్లమ్మ తల్లిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.