News April 6, 2025
కొలిమిగుండ్లలో పండగ పూట విషాదం

కొలిమిగుండ్ల మండలం నందిపాడు గ్రామంలో శ్రీరామ నవమి రోజు విషాదం నెలకొంది. నందిపాడుకు చెందిన నాగార్జున(16) పదో తరగతి విద్యార్థి బైక్పై తిమ్మనాయినిపేట నుంచి స్వగ్రామానికి వస్తుండగా పొలాల్లో నుంచి దున్నపోతు అడ్డుగా వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 16, 2025
జగిత్యాల: భూభారతితో భూ రికార్డుల ప్రక్షాళన: కలెక్టర్

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూ భారతి పోర్టల్పై జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో RDOలు, MROలు పాల్గొన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన, డిజిటలైజేషన్, హక్కుల కల్పనపై చర్చించారు. ప్రజలతో సమన్వయంతో పనిచేయాలని అధికారులను కోరారు. సర్వే పనులు నిష్పాక్షికంగా చేయాలన్నారు. భూ భారతి భవిష్యత్ తరాలకు దోహదపడే కార్యక్రమమని పేర్కొన్నారు.
News April 16, 2025
దుమ్ముగూడెం: మావోయిస్టులకు వ్యతిరేకంగా కరపత్రాలు

ఆదివాసీ యువజన సంఘం పేరుతో మంగళవారం దుమ్ముగూడెం మండలంలో పలుచోట్ల కరపత్రాలు వెలిశాయి. గోవిందపురం, పెద్ద బండి రేవు, చిన్ననలబల్లి, ములకపాడు, లక్ష్మీనగరం ప్రధాన సెంటర్లలో వెలసిన కరపత్రాలలో గిరిజనులకు ఆధారమైన అడవిలోకి వెళ్లకుండా మావోయిస్టులు బాంబులు అమర్చడం సరైన పద్ధతి కాదని ఎంతకాలం ఈ అరాచకాలు, మమ్మల్ని అభివృద్ధి చెందనివ్వరా అంటూ ప్రశ్నిస్తూ కరపత్రాలలో పేర్కొన్నారు.
News April 16, 2025
బాలీవుడ్లోకి ధోనీ ఎంట్రీ?

బాలీవుడ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్ కరణ్ జోహార్ చేసిన ఓ పోస్టుతో క్రికెటర్ <