News February 8, 2025
కోటపల్లి: MLC అభ్యర్థిగా సంపత్ యాదవ్ నామినేషన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738936207740_51297756-normal-WIFI.webp)
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం మల్లంపేట గ్రామానికి చెందిన అంగ సంపత్ యాదవ్ ఉమ్మడి ఆదిలాబాద్,మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల స్వతంత్ర అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా కేంద్రంలో శాసనమండలి రిటర్నింగ్ అధికారి పమేల సత్పతికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 8, 2025
ధర్మపురి: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738976871191_1259-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News February 8, 2025
‘స్థానిక’ ఎన్నికలు.. 10న ఓటర్ల జాబితా
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738976046534_695-normal-WIFI.webp)
TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు SEC కసరత్తు చేస్తోంది. రాష్ట్రంలోని 5,817 MPTC, 570 ZPTC స్థానాల్లోని ఓటర్ల జాబితాను ఈ నెల 10న విడుదల చేయాలని ఉత్తర్వులిచ్చింది. అలాగే ఆయా స్థానాల పరిధిలోని పోలింగ్ స్టేషన్ల వివరాలతో 11న డ్రాఫ్ట్ ప్రకటించాలని ఆదేశించింది. 12, 13న అభ్యంతరాలు స్వీకరించి, 15న తుది జాబితా రిలీజ్ చేయాలని సూచించింది. ఎన్నికల నిర్వహణపై సిబ్బందికి ఈనెల 15లోగా శిక్షణ <<15393143>>పూర్తిచేయాలంది.<<>>
News February 8, 2025
జగిత్యాల: బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1738952583035_20571816-normal-WIFI.webp)
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణ శివార్లలో వాగు వద్ద గల బావిలో ఓ వ్యక్తి మృతదేహం శుక్రవారం రాత్రి లభ్యమైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బహిర్భూమి కోసం వచ్చి ప్రమాదవశాత్తు బావిలో పడి ఉంటాడని తెలుపుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి ఎస్ఐ ఉదయ్ వెళ్లి పరిశీలించారు. మృతుడు జగిత్యాలకు చెందిన ఎండీ హమీద్గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.