News February 3, 2025
కోట్ పల్లి: పార్టీ పటిష్టతే లక్ష్యంగా పనిచేయాలి: ఎమ్మెల్యే
పార్టీ పటిష్టతే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పని చేయాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం టీపీసీసీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సంతోష రాజు ఎంపిక కావడంతో డీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్యే రాంమోహన్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే ను శాలువాలతో సత్కరించి నియామక పత్రాన్ని వారికి అందజేశారు. మహిళలను భాగస్వామ్యం చేస్తూ పార్టీ పటిష్టతకు పని చేయాలన్నారు.
Similar News
News February 3, 2025
RG Kar మెడికల్ కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య
వైద్య విద్యార్థినిపై హత్యాచార ఘటనతో వార్తల్లో నిలిచిన కోల్కతాలోని RG Kar మెడికల్ కాలేజీలో మరో దుర్ఘటన జరిగింది. అక్కడి ESI క్వార్టర్స్లో MBBS విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. రాత్రి తలుపు తీయకపోవడంతో తల్లి డోర్ను తోసుకుని లోపలికి వెళ్లగా ఆమె ఉరికి వేలాడుతూ కనిపించింది. ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. రూమ్లో సూసైడ్ నోట్ లేదని, డిప్రెషన్ కారణంగా చనిపోయి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు.
News February 3, 2025
త్వరలోనే గజ్వేల్లో కేసీఆర్ భారీ సభ!
TG: ఏడాది కాలంగా ఇంటికే పరిమితమైన మాజీ సీఎం KCR త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి రానున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ఏడాది పాలనా వైఫల్యాలపై గజ్వేల్లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహణకు యోచిస్తున్నారు. అనువైన స్థలం కోసం పార్టీ శ్రేణులు వెతుకుతున్నట్లు సమాచారం. రైతు రుణ మాఫీ, రైతు భరోసా, నేతన్నలు, అన్నదాతలు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలపై కేసీఆర్ ప్రభుత్వాన్ని నిలదీస్తారని తెలుస్తోంది.
News February 3, 2025
నేడు మున్సిపాలిటీల్లో ఛైర్మన్ ఎన్నికలు
AP: మూడు మున్సిపాలిటీలకు ఛైర్మన్లు, 4 పురపాలికల్లో వైస్ ఛైర్మన్లు, 3 కార్పొరేషన్లకు డిప్యూటీ మేయర్ పదవులకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి. కార్పొరేటర్లు ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటారు. ఇందుకోసం ఉ.11 గంటలకు కౌన్సిళ్లకు సమావేశాలు నిర్వహించనున్నారు. తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్లు, నందిగామ, హిందూపురం, పాలకొండ, నూజివీడు, తుని, పిడుగురాళ్ల, బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరుగుతాయి.