News February 22, 2025

కోనసీమ జిల్లా TODAY TOP NEWS

image

➤ఆలమూరు: తండ్రి చితికి తలకొరివి పెట్టిన కుమార్తె
➤ DRKM: శివరాత్రి ఏర్పాట్లు సమీక్షించిన ఎస్పీ
➤ మండపేట: జాతీయస్థాయి క్రీడలకు ముగ్గురు ఎంపిక
➤ అమలాపురంలో సెలూన్, పార్లర్లో తనిఖీలు
➤ ఉప్పలగుప్తం: సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు
➤ ముమ్మిడివరంలో అలరించిన 8 మంది కవలలు
➤ వాడపల్లిలో జబర్దస్త్ నటి సందడి
➤ అమలాపురం: కనువిందు చేసిన కవలలు

Similar News

News February 23, 2025

ప్రజల పక్షాన నిలుస్తాం: కన్నబాబు

image

వైసీపీ ప్రజల పక్షాన నిలిచి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడుతుందని ఆ పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కన్నబాబు వెల్లడించారు. ఆదివారం విశాఖ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేని పరిస్థితిలో ఉందని ఆరోపించారు. తాను నిత్యం అందుబాటులో ఉంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

News February 23, 2025

కృష్ణా: పోలవరం లాకుల వద్ద ఇద్దరు గల్లంతు

image

కృష్ణా జిల్లాలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. పోలవరం లాకులు కొమ్మూరు వద్ద నీటిలో పడి ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. వీరవల్లి ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం.. షేక్ నాగూర్ బాషా (16), షేక్ షరీఫ్ (16) తన తండ్రితో కలిసి చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో వారు ఇద్దరూ కాలుజారి నీటిలో పడిపోయారు. వారిని రక్షించే ప్రయత్నం చేసినప్పటికీ వారు మునిగిపోయారని పోలీసులు తెలిపారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. 

News February 23, 2025

కొత్త రేషన్ కార్డులపై శుభవార్త

image

TG: మార్చి 1న కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 26న 16వేల కుటుంబాలకు కార్డులు ఇవ్వగా, మార్చి 1న ఎన్నికల కోడ్ లేని HYD, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పంపిణీ చేయనుంది. MAR 8 తర్వాత మిగతా జిల్లాల్లో జారీ చేయనున్నారు. ఏళ్లుగా రేషన్ కార్డుల పంపిణీ లేకపోవడంతో కొందరు 2-3సార్లు దరఖాస్తులు చేయగా, అధికారులు కులగణన సర్వే ప్రామాణికంగా పరిశీలిస్తున్నారు.

error: Content is protected !!