News May 28, 2024

కోనసీమ జిల్లాలో తొలి ఫలితం వెలువడేది అక్కడే..!

image

కోనసీమ జిల్లాలో తొలి ఫలితం రాజోలు నియోజకవర్గంలో వెలువడనుంది. అనంతరం అమలాపురం రూరల్ మండలం, పాలగుమ్మి, బండారులంక నుంచి ప్రారంభమవుతుంది. పి.గన్నవరంలోని ఆదుర్రు, రామచంద్రపురంలోని కొత్తూరు, ముమ్మిడివరంలోని గురజాపులంకలో వెలువడనున్నాయి. తర్వాత కేశవరం, మండపేటతో ఓట్ల లెక్కింపు ముగియనుంది.

Similar News

News October 9, 2024

రాజానగరం: భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం

image

రాజానగరం మండలం భూపాలపట్నంలో ఓ బర్త్ డే పార్టీలో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తూ పోలీసులకు పట్టుబడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం ప్రకారం ఓ ఫంక్షన్ హాల్ వద్ద జరుగుతున్న బర్త్ డే ఫంక్షన్‌లో పాల్గొన్న ముగ్గురు యువకులు కారులో కూర్చుని డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డారు. యువకులకు ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అన్న కోణంలో కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.

News October 9, 2024

తూ.గో: దసరాకు 16 ప్రత్యేక రైళ్లు

image

దసరాకు విజయవాడ-శ్రీకాకుళం, శ్రీకాకుళం-విజయవాడకు 16 ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే సీపీఆర్ఓ శ్రీధర్ మంగళవారం తెలిపారు. విజయవాడ-శ్రీకాకుళానికి ఈ నెల 9, 10,11,12,14,15,16,17 తేదీల్లో ప్రత్యేక రైలు నడుస్తుందన్నారు. శ్రీకాకుళం-విజయవాడకు ఈ నెల 10,11,12,13,15,16,17,18 తేదీల్లో ప్రత్యేక రైలు తిరుగుతుందన్నారు. ఈ రైళ్లు నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, ద్వారపూడి స్టేషన్లో నిలుస్తాయన్నారు.

News October 9, 2024

తూ.గో: ఇన్‌స్టాలో పరిచయమై ఇంట్లో చెప్పకుండా వెళ్లారు..

image

దసరా సెలవులకు విశాఖకు వెళ్లి సరదాగా గడపాలనుకొన్న నలుగురు బాలికలు ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయారు. రాజమండ్రి, రావులపాలేనికి చెందిన వారికి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం ఏర్పడింది. అందరూ మాట్లాడుకొని విశాఖకు బయలుదేరగా రాజమండ్రిలో షీ టీమ్స్ బాలికలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని విచారించగా ఈ విషయం బయటపడింది. దీంతో వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.