News March 17, 2025

కోనసీమ: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈవో షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏ ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9493819102కు తెలియజేయాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసి స్క్వాడ్లను నియమించామన్నారు.

Similar News

News March 17, 2025

ప్రతిపక్ష నేతలకు భట్టి ఫోన్.. అఖిలపక్ష భేటీపై ఆరా

image

TG: సరైన షెడ్యూల్ లేని కారణంగా పునర్విభజనపై అఖిలపక్ష సమావేశానికి అన్ని పార్టీల ఎంపీలు డుమ్మా కొట్టారు. దీంతో ప్రతిపక్ష నేతలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోన్ చేశారు. తేదీని ఖరారు చేయడం కోసం ఆరా తీశారు. సాయంత్రం భేటీ అవుదామని కోరగా రాజకీయ పార్టీల నుంచి స్పష్టత రాలేదు.

News March 17, 2025

నాగన్న బావిని అభివృద్ధి చేయాలి: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే

image

లింగంపేట మండల కేంద్రంలో గల పురాతన నాగన్న బావిని అభివృద్ధి చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు. ఆయన అసెంబ్లీలో పురాతన ఆలయాలపై మాట్లాడారు. నాగన్న బావిని పర్యటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరారు. ఇప్పటికే దాతల సహకారంతో నాగన్న బావిని కొంతమేరకు అభివృద్ధి చేసినట్లు వివరించారు. పర్యాటక కేంద్రానికి కావలసిన నిధులు మంజూరు చేయాలని కోరారు.

News March 17, 2025

తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి గొప్పతనం ఇదే..

image

TG రాజకీయ, సాంఘిక చైతన్యానికి మరోపేరు సురవరం ప్రతాపరెడ్డి. పత్రికా సంపాదకుడు, పరిశోధకుడు, పండితుడు, రచయిత, నిజాం వ్యతిరేక ఉద్యమ నేతగా ఆయన సుపరిచితుడు. ‘నిజాం రాష్ట్రంలో ఆంధ్ర కవులు పూజ్యము’ అన్న నిందను సవాల్‌గా తీసుకొని 354 కవులతో ‘గోల్కొండ కవుల సంచిక’ గ్రంథం ప్రచురించారు. గోల్కొండ పత్రికనూ నడిపారు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, రామాయణ విశేషాలు, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు వంటి పుస్తకాలు రాశారు.

error: Content is protected !!