News March 17, 2025

కోనసీమ: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈవో షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏ ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9493819102కు తెలియజేయాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసి స్క్వాడ్లను నియమించామన్నారు.

Similar News

News December 17, 2025

ఖేడ్: 2 ఓట్లతో గెలిచిన అభ్యర్థి

image

నారాయణఖేడ్ మండలం కొండాపూర్ హనుమాన్ మందిర్ తండా సర్పంచిగా స్వరూప రవీందర్ విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి స్వరూప సమీప ప్రత్యర్థిపై 2 ఓట్ల తేడాతో గెలుపొందారు. దీంతో సర్పంచ్ అనుచరులు గ్రామంలో టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్య వాదాలు తెలిపారు. ప్రజలకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.

News December 17, 2025

జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మార్పుపై స్పీకర్ నిర్ణయం ఏంటి..?

image

రాష్ట్రంలో ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ లను స్పీకర్ బుధవారం కొట్టివేశారు. అయితే పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయంలో అసెంబ్లీ స్పీకర్ ఇంకా నిర్ణయం వెల్లడించలేదు. దీంతో స్పీకర్ నిర్ణయం ఇలా ఉంటుందోనని జగిత్యాలలో ఉత్కంఠ భరితంగా చర్చ నడుస్తుంది.

News December 17, 2025

రాజవొమ్మంగి: ‘ప్రకృతి సాగు విత్తనాలు జాగ్రత్తగా భద్రపరచండి’

image

రాజవొమ్మంగి మండలం ఊర్లకులపాడులోని ప్రకృతి సాగు బయో రీసెర్చ్ సెంటర్‌ను జిల్లా ప్రకృతి సాగు అధికారి భాస్కరావు బుధవారం పరిశీలించారు. విత్తనాలు ఎలా భద్ర పరచాలో సిబ్బందికి సూచించారు. రానున్న కాలంలో ప్రకృతి సాగు అల్లూరి జిల్లాలో పెరగనున్నదని, అనుగుణంగా విత్తనాలు సిద్ధం చేయాలన్నారు. కో-ఆర్డినేటర్ అప్పలరాజు ఉన్నారు.