News March 17, 2025

కోనసీమ: టెన్త్ పరీక్షలు.. కంట్రోల్ రూమ్ ఏర్పాటు

image

నేటి నుంచి జిల్లాలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. వీటి నిర్వహణకు ముమ్మిడివరం ఎయిమ్స్ కళాశాలలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్లు డీఈవో షేక్ సలీంబాషా తెలిపారు. పరీక్షల నిర్వహణలో ఏ ఇబ్బందులు తలెత్తితే కంట్రోల్ రూం నంబర్ 9493819102కు తెలియజేయాలన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ఠమైన ఏర్పాట్లు చేసి స్క్వాడ్లను నియమించామన్నారు.

Similar News

News March 17, 2025

REWIND: 1967వ నాటి ఆమదాలవలస రైల్వే స్టేషన్

image

ఆమదాలవలస పట్టణంలో శ్రీకాకుళం రోడ్డు పేరుతో ఉన్న రైల్వే స్టేషన్ జిల్లాలోని అతిపెద్ద రైల్వే స్టేషన్‌గా ఉంది. అలాంటి రైల్వే స్టేషన్ 1967వ సంవత్సరంలో ఎలా ఉండేదో తెలిపే పాత ఫొటో వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్‌బుక్ అకౌంట్‌లలో ప్రస్తుతం వైరల్ చేస్తున్నారు. అప్పటిలో ఆమదాలవలస పట్టణాన్ని ఆముదం పట్టణంగా పిలిచేవారని, అశోకుడి కాలంలో హేరందపల్లిగా పిలుచుకునే వారిని ప్రస్తుతం ఈ ఫొటో ద్వారా చర్చనీయాంశంగా మారింది. 

News March 17, 2025

ఉయ్యాలవాడ పేరు పెట్టాలని వినతి

image

ఓర్వకల్ విమానాశ్రయానికి స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి కోరారు. ఈ మేరకు కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడును ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఉయ్యాలవాడ పేరు పెట్టాలంటూ వినతి పత్రాన్ని అందజేశారు. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపారు.

News March 17, 2025

కనికట్టు చేయడంలో చంద్రబాబు దిట్ట: బొత్స

image

AP: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు కనికట్టు చేయడంలో CM చంద్రబాబు దిట్ట అని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. స్కాముల పేరుతో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండలిలో ఆయన మండిపడ్డారు. ‘2019-24 మధ్య జరిగిన స్కాముల మీద చర్చ పెట్టారు. కానీ 2014 నుంచి 2024 వరకు జరిగిన స్కాములపై మేం చర్చకు సిద్ధం. మా హయాంలో ఎలాంటి స్కాములు జరగకుండానే జరిగినట్లు ఆరోపణలు చేస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.

error: Content is protected !!