News March 23, 2025

కోనసీమ: రేపు యథావిధిగా మీకోసం వేదిక: కలెక్టర్

image

అమలాపురంలోని కోనసీమ జిల్లా కలెక్టరేట్ వద్ద సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన అమలాపురం నుంచి ప్రకటన విడుదల చేశారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News March 26, 2025

అమ్మలూ.. హ్యాపీ బర్త్‌డే: NTR

image

టాలీవుడ్ స్టార్ హీరో Jr.NTR తన సతీమణి లక్ష్మీ ప్రణతికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆమెతో తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ‘అమ్మలూ.. హ్యాపీ బర్త్ డే’ అని విషెస్ తెలియజేశారు. ‘దేవర’ సినిమా రిలీజ్ సందర్భంగా వీరు ప్రస్తుతం జపాన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి వివాహం 2011లో జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు అభయ్ రామ్, భార్గవ రామ్ ఉన్నారు.

News March 26, 2025

రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికం..!

image

నంద్యాల జిల్లాలో కొద్ది రోజులుగా భానుడు విశ్వరూపం ప్రదర్శిస్తున్నాడు. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ(APSDMA) గణాంకాల ప్రకారం మంగళవారం నంద్యాల జిల్లా రుద్రవరంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 41.6°C ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి కాలం ప్రారంభంలోనే ఈ స్థాయిలో భానుడు విరుచుకుపడటంపై ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. కాగా, కొద్దిరోజులుగా నంద్యాల జిల్లాలోనే అధిక ఉష్ణోగ్రత నమోదవుతుండటం గమనార్హం.

News March 26, 2025

నిర్మల్ ఎస్పీ క్యాంప్ ఆఫీస్‌లో నేడు ఇఫ్తార్ విందు

image

నిర్మల్ పోలీస్ మీ పోలీస్ కార్యక్రమంలో భాగంగా జిల్లా ముస్లిం పోలీసు సిబ్బందికి బుధవారం ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల తెలిపారు. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సాయంత్రం 6 గంటలకు నిర్వహించే ఇఫ్తార్ విందులో ముస్లిం పోలీసులు పాల్గొనాలని కోరారు.

error: Content is protected !!