News April 15, 2025

కోరుకొండలో రోప్‌వే.. ఫలించిన ఎమ్మెల్యే కృషి

image

కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం కింద నుంచి కొండపై వరకు 0.25 కిలోమీటర్ల మేర రోప్‌వే చేయాలని ఎమ్మెల్యే ప్రతిపాదనను కేంద్రం అంగీకరించింది. ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్, అన్నవరం దేవస్థానం వారి సమగ్ర ప్రణాళికతో డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను ఎంపీకి నేరుగా అందించడం వల్ల నలుగురు మంత్రులు ఆమోదించి 36 కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News April 16, 2025

రాజమండ్రి: నేటి నుంచి మోగనున్న పెళ్లి బాజాలు

image

నేటి నుంచి జిల్లాలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఈ వేసవిలో వేల సంఖ్యలో వివాహాలు జరగనున్నాయి. బుధవారం నుంచి జూన్ 8 వరకు పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. మళ్లీ జూన్ 11 నుంచి జూలై 12వరకు ముహూర్తాలు లేవు. జూలై 25 నుంచి శ్రావణమాసంలో శుభ ఘడియలు ఉండటంతో ముహూర్తాలు ఉండనున్నాయి. ఇక ఏప్రిల్, మే, జూన్ నెలల్లో శుభ ముహూర్తాలు ఎక్కువగా ఉండటంతో తెలుగింట వివాహ వేడుకలకు అంతా సిద్ధం అవుతున్నారు.

News April 16, 2025

తెలంగాణలో చనిపోయిన ముగ్గురు జిల్లా వాసులు వీరే..

image

తెలంగాణలో జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం రాఘవాపూర్ శివారు జాతీయ రహదారి వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో AMP (M) సవరప్పాలేనికి చెందిన ఒకే కుటుంబసభ్యులు ముగ్గురు మృతి చెందారు. సత్తి శ్రీను, భార్య రమణకుమారి, కుమార్తె అనూష చనిపోయారు. వీరి మృతదేహాలకు జనగామ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి బుధవారం సొంత గ్రామానికి తీసుకురానున్నట్లు బంధువులు తెలిపారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

News April 16, 2025

చాగల్లు: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

బాలికను నమ్మించి మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసి పోక్సో కేసు నమోదు చేశారు. చాగల్లు (M) బ్రాహ్మణగూడెంకు చెందిన బాలిక(15)పై అదే గ్రామానికి చెందిన సిద్దార్ధ చంద్ర అత్యాచారానికి పాల్పడి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఈనెల 10న ఫిర్యాదు చేసింది. సిద్దార్ధను మంగళవారం అరెస్టు చేసి కోర్టులో హజరుపరచగా రిమాండ్ విధించినట్లు డీఎస్పీ దేవకుమార్ తెలిపారు.

error: Content is protected !!