News April 6, 2024
కోరుట్ల: ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి

తాగునీటి సరఫరా చేసే ట్రాలీ ఆటో ఢీకొని 16 నెలల బాలుడు మృతి చెందిన సంఘటన కోరుట్ల పట్టణంలో శనివారం జరిగింది. అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పొట్ట రిసింద్ర, అపూర్వల కుమారుడైన సుధన్వన్.. ఇంటి ముందు ఆడుకుంటున్నాడు. ఈక్రమంలో అటుగా వచ్చిన ఆటో డ్రైవర్ అజాగ్రత్తతో నడిపి బాలుడిని ఢీకొట్టాడు. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News April 22, 2025
ఇంటర్ ఫలితాల్లో అల్ఫోర్స్ ప్రభంజనం

ఇంటర్మీడియట్ ఫలితాల్లో కరీంనగర్ అల్ఫోర్స్ జూనియర్ కాలేజీ ప్రభంజనం సృష్టించిందని అల్ఫోర్స్ విద్యాసంస్థల ఛైర్మన్ వి.నరేందరెడ్డి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం MPC విభాగంలో S.లహరి 468, హప్సహస్నాన్ 468, తహూరా నూర్ 468 మార్కులు సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఎంపీసీ విభాగంలో K.రుత్విక్ 996, శ్రీనిత్యరెడ్డి 995, రుత్విక 995 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో సత్తాచాటారని ఆయన ప్రకటించారు.
News April 22, 2025
ఇల్లందకుంట ఆలయ ఆదాయ వివరాలు

ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో 2025 శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల హుండీ లెక్కింపు మంగళవారం ఉదయం 9గంటలకు జరిగింది. ఈ సందర్భంగా రూ.20,69,829 నగదు, 12గ్రా. బంగారం, 305గ్రా. వెండి, 225 డాలర్లు, ఇతర విదేశీ కరెన్సీ లభించాయి. ఈసారి గతేడాదితో పోలిస్తే రూ.2.94 లక్షలు అధికంగా ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు.
News April 22, 2025
464/470 సాధించిన కేశవపట్నం కస్తూర్బా విద్యార్థిని

ఓదెల మండలంలోని గుంపులకు చెందిన పంజాల స్వాతి కేశవపట్నంలోని కస్తూర్బా పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. పేద కుటుంబానికి చెందిన స్వాతి ఇంటర్ ఫస్టియర్ ఎంపీసీలో 464/470 మార్కులు సాధించింది. కస్తూర్బా పాఠశాల టాపర్గా నిలిచింది. పాఠశాల హెచ్ఎం స్వాతికి శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధిస్తానని ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే తన లక్ష్యమన్నారు.