News February 25, 2025
క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యం: కోటాచలం

సూర్యాపేట జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ల్యాబ్ టెక్నీషియన్లు, టీబీ సూపర్వైజర్లకు DMHO డాక్టర్ కోటాచలం మంత్లీ రివ్యూ మీటింగ్ కలెక్టరేట్లో నిర్వహించారు. నిక్షయ శిబిర్ (వంద రోజుల్లో టీబి నిర్మూలన)లో భాగంగా రోగులను గుర్తించి అవగాహన కల్పించాలని సూచించారు. తేమడుతో కూడిన దగ్గు రెండు వారాలకు మించి ఉంటే పరీక్షలు చేయించాలని అన్నారు. వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Similar News
News February 26, 2025
బ్రహ్మ, విష్ణువు మధ్య వివాదం.. శివుడు ఏం చేశాడంటే?

విష్ణువు, బ్రహ్మ మధ్య ఎవరుగొప్ప అనే వివాదం తలెత్తుతుంది. అప్పుడు శివుడు జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి, లింగానికి ఆది, అంతాలను కనిపెట్టిన వారే గొప్పవారని చెబుతాడు. విష్ణువు మహాలింగం మూలం కనుగొనేందుకు ప్రయత్నిస్తాడు. బ్రహ్మ ఆది తెలుసుకోవాలని చూసి విఫలమవుతాడు. అయితే తాను ఆది కనుగొన్నట్లు మొగలిపువ్వు, గోవుతో శివుడికి అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. అది తెలిసి బ్రహ్మ, మొగలిపువ్వు, గోవును శివుడు శపిస్తాడు.
News February 26, 2025
జనగామ: అన్ని పాఠశాలలకు జిల్లా అధికారి ఆదేశాలు

ఈనెల 28న జనగామ జిల్లాలోని అన్ని పాఠశాలల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా సైన్స్ అధికారి ఉపేందర్ మంగళవారం ఒక ప్రకటనలో ఆదేశించారు. సైన్స్ ప్రాముఖ్యతను తెలిపేలా వివిధ రకాల పోటీలను నిర్వహించాలని ప్రకటనలో పేర్కొన్నారు. పాఠశాల స్థాయిలో గెలుపొందిన విద్యార్థులకు పేరెంట్స్ కమిటీ ప్రోత్సాహంతో బహుమతులు అందజేయాలని సూచించారు. వివరాలకు 9441453662 నంబర్లో సంప్రదించాలని కోరారు.
News February 26, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు 5 రోజులు సెలవులు..

మహబూబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్కు నేటి నుంచి మార్చి 2వ తేదీ వరకు సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ ఛైర్మన్ గంట సంజీవరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 26 శివరాత్రి, 27 మహాశివరాత్రి జాగరణ, 28 అమావాస్య, 1 వారాంతపు సెలవు, 2 ఆదివారం వారాంతపు సెలవు ఇస్తున్నట్లు తెలిపారు. కావున రైతులు గమనించాలని కోరారు.